
హైదరాబాద్, వెలుగు: మూసీ నదిపై బ్రిడ్జి నిర్మాణాల శంకుస్థాపనలో భాగంగా సోమవారం అంబర్పేటలో పర్యటిస్తున్న మంత్రి కేటీఆర్ కాన్వాయ్ను యూత్కాంగ్రెస్ నేతలు అడ్డుకున్నారు. దీంతో అక్కడ కొద్దిసేపు ఉద్రిక్తత నెలకొంది.
యూత్ కాంగ్రెస్ నేత మోత రోహిత్ మాట్లాడుతూ.. రాష్ట్రం ఏర్పాటైన తర్వాత పదేండ్లలో ఒకే ఒక్క గ్రూప్–1 నోటిఫికేషన్ ఇచ్చి ప్రిలిమ్స్ను రెండు సార్లు రద్దు చేశారని మండిపడ్డారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ప్రత్యేక చట్టంతో టీఎస్పీఎస్సీని ప్రక్షాళన చేసి, పోస్టులను త్వరితగతిన భర్తీ చేస్తామన్నారు.