దేశంలో తగ్గుతున్న కరోనా కేసులు

దేశంలో  తగ్గుతున్న కరోనా కేసులు

న్యూఢిల్లీ : దేశంలో కరోనా కేసులు, మరణాల సంఖ్య క్రమంగా తగ్గుతోంది. దేశవ్యాప్తంగా కొత్తగా 58,077 కొవిడ్ కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో 1,50,407 మంది కరోనా నుంచి కోలుకోగా.. 657 మంది చనిపోయినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది. యాక్టివ్ కేసుల సంఖ్య 7లక్షల లోపుకు చేరింది. ప్రస్తుతం దేశంలో 6,97,802 యాక్టివ్ కేసులున్నాయి. పాజిటివిటీ రేటు కూడా గణనీయంగా తగ్గింది. ప్రస్తుతం అది 3.89శాతంగా ఉంది. దేశంలో ఇప్పటి వరకు కరోనా బారిన పడి 5,07,177 మంది చనిపోయారు. ఇప్పటి వరకు 171,79,51,432 వ్యాక్సిన్లు ఇచ్చారు. 

మరిన్ని వార్తల కోసం..

అర్థరాత్రి టీడీపీ ఎమ్మెల్సీ అరెస్ట్

చిన్నారి గంగూబాయ్​