కాంగ్రెస్‌కు ఓటేస్తే, బీజేపీకి ఓటు వేసిన‌ట్టే 

 కాంగ్రెస్‌కు ఓటేస్తే, బీజేపీకి ఓటు వేసిన‌ట్టే 

కాంగ్రెస్ కు ఓటేస్తే ఇన్ డైరెక్ట్ గా  బీజేపీకి  ఓటేసిన‌ట్టేన‌ని సీఎం అరవింద్ కేజ్రీవాల్ అన్నారు.  కొన్నేళ్ళుగా గోవాని కాంగ్రెస్ పాలించింద‌ని..అయితే బీజేపికి  క్యాడ‌ర్ ఫీడ‌ర్ గా మారిపోయింద‌న్నారు. గోవాలో ఆమ్ ఆద్మీ, బీజేపీల మ‌ధ్య పోరుకొన‌సాగుతోంద‌ని తెలిపారు. బీజేపీని వెళ్ల‌గొట్టాలంటే మాకే ఓటు వేయండ‌ని కేజ్రీవాల్ కోరారు. మీకు స్వచ్ఛమైన, నిజాయితీ గల ప్రభుత్వం కావాలంటే, మీరు ఆప్‌కి ఓటు వేయవచ్చు. ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా బీజేపీకి ఓటు వేయడం మరో ఆప్షన్. మీరు కాంగ్రెస్‌కు ఓటు వేసినప్పుడే పరోక్ష ఓటింగ్ అని, ఆ కాంగ్రెస్ వ్యక్తి గెలిచి బీజేపీకి వెళ్తాడ‌ని కాంగ్రెస్ పై విరుచుకుప‌డ్డారాయ‌న‌. కోస్తా రాష్ట్రంలో 2017 ఎన్నికల నాటి నుండి పరిస్థితిని ప్రస్తావించారు. ఈ ఎన్నికల్లో 17 మంది ఎమ్మెల్యేలతో అతిపెద్ద పార్టీగా అవతరించిన కాంగ్రెస్‌కు ఇప్పుడు కేవలం ఇద్దరు మాత్రమే ఉన్నారు. రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత మిగిలిన వారిలో ఎక్కువ మంది బీజేపీలో చేరార‌న్నారు.

మరిన్ని వార్తల కోసం...

తిరుపతి కోర్టుకు హాజరైనఎంపీ సుబ్రహ్మణ్య స్వామి