మంచిర్యాల జిల్లాలో ఎస్ బీఐ ఏటీఎంలో చోరీకి యత్నం

మంచిర్యాల జిల్లాలో ఎస్ బీఐ ఏటీఎంలో చోరీకి యత్నం
  • అలారం మోగడంతో దుండగుల పరుగులు
  • పెట్రోలింగ్ పోలీసులకు పట్టుబడిన ఓ దొంగ
  • బెల్లంపల్లి టూ టౌన్ పోలీసుస్టేషన్ సమీపంలోనే ఘటన

బెల్లంపల్లి, వెలుగు: ఏటీఎంలో చోరీకి యత్నించిన దుండగులు పారిపోతూ ఒకరు పట్టుబడిన ఘటన  మంచిర్యాల జిల్లాలో జరిగింది. పోలీసులు తెలిపిన ప్రకారం.. బెల్లంపల్లి టౌన్ కాల్‌‌టెక్స్ ఏరియాలోని ఎస్‌‌బీ‌‌ఐ ఏటీఎంలో సోమవారం తెల్లవారుజామున 3 గంటల సమ యంలో దుండగులు చోరీకి యత్నించారు. గ్యాస్ కట్టర్‌‌తో ఏటీఎం మెషీన్ కట్ చేశారు. దీంతో అలారం మోగడంతో దుండగులు పారిపోతుండగా.. అదే సమయంలో బెల్లంపల్లి టూ టౌన్ పోలీసులు పెట్రోలింగ్ పోలీసులు ఓ దొంగను పట్టుకున్నారు. 

టూ టౌన్ పోలీస్ స్టేషన్‌‌కు సమీపంలోనే ఘటన జరడంతో  బెల్లంపల్లి ఏసీపీ ఎ. రవికుమార్, రూరల్ సీఐ అఫ్జలొద్దీన్ పరిశీలించారు. పోలీసులు క్లూస్ టీంలను రప్పించి అన్ని కోణాల్లో దర్యాప్తు చేపట్టారు. చోరీకి వచ్చిన వారు ఎంతమంది?  ఏ ప్రాంతానికి చెందినవారు? అనే కోణాల్లో విచారిస్తున్నామని పోలీసులు తెలిపారు.