నిన్న సీఎం సోయి లేకుండా మాట్లాడిండు

నిన్న సీఎం సోయి లేకుండా మాట్లాడిండు

సీఎం కేసీఆర్ పేదల రక్తం తాగుతుండన్నారు బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్. చంపాపేటలో బీజేపీ ఓబీసీ సదస్సులో మాట్లాడిన  ఆయన.. రోడ్లు వేసేది, బియ్యం ఇచ్చేది కేంద్రమేనన్నారు. రైతు వేదిక నిర్మాణానికి ప్రభుత్వానికి డబ్బులెక్కడివి అని  ప్రశ్నించారు.   నిన్న సీఎం సోయి లేకుండా మాట్లాడారన్నారు. తాగి ప్రభుత్వాన్ని నడిపితే నేరం కాదా అని ప్రశ్నించారు.  కేసీఆర్ కుటుంబం కోసమా? తెలంగాణ వచ్చింది అని అన్నారు..  తెలంగాణ సీఎం కేసీఆర్ సొత్తా అని ప్రశ్నించారు. సబ్బండ వర్గాలు తెలంగాణ కోసం పోరాడాయన్నారు. రాష్ట్రంలో కుటుంబం పాలన అంతమొందించాలన్నారు.  కేసీఆర్ కుటుంబం కోసమా? తెలంగాణ తెచ్చుకుంది అని ప్రశ్నించారు. జనం కోసం పని చేసేపార్టీ బీజేపీ అని అన్నారు. బీజేపీ పోరాటానికి  ప్రజలు అండగా ఉండాలన్నారు బండి సంజయ్.

మరిన్ని వార్తల కోసం..

ఏప్రిల్ 1 నుంచి ఆఫీసులకు రావాల్సిందే

ముఖ్యమంత్రిని ఓడించి తీరుతాం