ఉద్యమాన్ని ఉపసంహరించుకోలేదని..సస్పెండ్ చేయబడిందన్నారు భారతీయ కిసాన్ యూనియన్ నేత రాకేశ్ టికాయత్.. రైతు సమస్యలపై కేంద్రంతో పోరాడుతూనే ఉంటామన్నారు. ఢిల్లీ, యూపీ బార్డర్ ను రైతులు ఖాళీచేశారు.. ఇవాళ భారతీయ కిసాన్ యూనియన్ నేత రాకేశ్ టికాయత్ ధర్నాస్థలిని ఖాళీ చేశారు.ఉద్యమానికి సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు రాకేశ్ టికాయత్. మూడు వ్యవసాయచట్టాలకు వ్యతిరేకంగా గత ఏడాది నుంచి రైతులు ఢిల్లీ సరిహద్దుల్లో ధర్నాలు చేశారు. వివాదాస్పద చట్టాలను కేంద్రం వెనక్కి తీసుకోవడంతో ఉద్యమాన్ని విరమించారు. మద్దతు ధరకు చట్టబద్ధత అంశంపై కమిటీ వేస్తామని కేంద్రం ప్రకటించడంతో రైతులు ఇండ్లకు తరలివెళ్తున్నారు.
I am thankful to everyone who has been with us. I also extend my gratitude to the people who ran langars, villagers who brought essentials for us. Talks underway with the Centre after withdrawal of 3 farm laws. Our movement is suspended, not withdrawn: BKU leader Rakesh Tikait pic.twitter.com/XuOtRQOglj
— ANI (@ANI) December 15, 2021