
యాదాద్రి, వెలుగు: పాఠశాలల్లో మెనూ ప్రకారం మధ్యాహ్న భోజనం పెట్టాలని, నాణ్యత పాటించాలని కలెక్టర్ హనుమంతరావు ఆదేశించారు. రాయగిరిలోని జెడ్పీ హైస్కూల్ను బుధవారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. టెన్త్ క్లాస్స్టూడెంట్స్తో మాట్లాడారు. చదివినవి మర్చిపోకుండా రివిజన్ చేస్తూ ఉండాలని సూచించారు.
డ్రగ్స్రహిత జిల్లాగా మార్చాలి
యాదాద్రిని డ్రగ్స్ రహిత జిల్లాగా మార్చాలని కలెక్టర్ హనుమంతరావు అన్నారు. నషా ముక్త్ భారత్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన మీటింగ్లో ఆయన మాట్లాడారు. పాఠశాలలు, కళాశాలలు, హాస్టళ్లలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు.
భూ సమస్యల అర్జీలను పరిష్కరించాలి
భూ భారతి రెవెన్యూ సదస్సుల్లో వచ్చిన అర్జీలను వెనువెంటనే పరిష్కరించాలని కలెక్టర్హనుమంతరావు ఆదేశించారు. తహసీల్దార్ల మీటింగ్లో ఆయన మాట్లాడుతూ.. భూ సమస్యలను క్షేత్రస్థాయిలో పరిశీలించాలన్నారు. ఆర్డీవోలు కృష్ణారెడ్డి, శేఖర్రెడ్డి, అడిషనల్ డీసీపీ లక్ష్మీనారాయణ, ఫారెస్ట్ఆఫీసర్ పద్మజారాణి, డీపీవో సునంద తదితరులున్నారు.
రిపోర్టర్పై దాడి చేసినవారిని శిక్షించాలి
యాదాద్రి, వెలుగు: తాడ్వాయి రిపోర్టర్ శ్రీకాంత్రెడ్డిపై దాడి చేసిన వారిని శిక్షించాలని యాదాద్రి జిల్లా రిపోర్టర్లు కోరారు. ఈ మేరకు కలెక్టర్హనుమంతరావుకు బుధవారం వినతిపత్రం అందించారు. టీయూడబ్ల్యూజే(ఐజేయూ) నాయకులు రవి, కరుణాకర్, హరిబాబు తదితరులున్నారు.