మెనూ ప్రకారం మధ్యాహ్న భోజనం పెట్టాలి

మెనూ ప్రకారం మధ్యాహ్న భోజనం పెట్టాలి

యాదాద్రి, వెలుగు: పాఠశాలల్లో మెనూ ప్రకారం మధ్యాహ్న భోజనం పెట్టాలని, నాణ్యత పాటించాలని కలెక్టర్​ హనుమంతరావు ఆదేశించారు.  రాయగిరిలోని జెడ్పీ హైస్కూల్​ను బుధవారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు.  టెన్త్​ క్లాస్​స్టూడెంట్స్​తో మాట్లాడారు. చదివినవి మర్చిపోకుండా రివిజన్ చేస్తూ ఉండాలని సూచించారు.

డ్రగ్స్​రహిత జిల్లాగా మార్చాలి

యాదాద్రిని డ్రగ్స్ రహిత జిల్లాగా మార్చాలని కలెక్టర్​ హనుమంతరావు అన్నారు. నషా ముక్త్​ భారత్​ అభియాన్​ కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన మీటింగ్​లో ఆయన మాట్లాడారు.  పాఠశాలలు, కళాశాలలు, హాస్టళ్లలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు.  

భూ సమస్యల అర్జీలను పరిష్కరించాలి

భూ భారతి రెవెన్యూ సదస్సుల్లో వచ్చిన అర్జీలను వెనువెంటనే పరిష్కరించాలని కలెక్టర్​హనుమంతరావు ఆదేశించారు. తహసీల్దార్ల మీటింగ్​లో ఆయన మాట్లాడుతూ.. భూ సమస్యలను క్షేత్రస్థాయిలో పరిశీలించాలన్నారు. ఆర్డీవోలు కృష్ణారెడ్డి, శేఖర్​రెడ్డి, అడిషనల్ డీసీపీ లక్ష్మీనారాయణ, ఫారెస్ట్​ఆఫీసర్​ పద్మజారాణి, డీపీవో సునంద తదితరులున్నారు. 

రిపోర్టర్​పై దాడి చేసినవారిని శిక్షించాలి

యాదాద్రి, వెలుగు: తాడ్వాయి రిపోర్టర్ ​శ్రీకాంత్​రెడ్డిపై దాడి చేసిన వారిని శిక్షించాలని యాదాద్రి జిల్లా రిపోర్టర్లు కోరారు. ఈ మేరకు కలెక్టర్​హనుమంతరావుకు బుధవారం వినతిపత్రం అందించారు. టీయూడబ్ల్యూజే(ఐజేయూ) నాయకులు రవి, కరుణాకర్, హరిబాబు తదితరులున్నారు.