28 నుంచి కాంగ్రెస్ రెండో విడుత బస్సుయాత్ర

28 నుంచి కాంగ్రెస్ రెండో విడుత బస్సుయాత్ర

హైదరాబాద్: ఈ నెల 28వ తేదీ నుంచి రాష్ట్రంలో కాంగ్రెస్ రెండో విడుత బస్సు యాత్ర నిర్వహించనుంది. దక్షిణ తెలంగాణలో నిర్వహించనున్న ఈ బస్సు యాత్రలో కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ,  ప్రియాంకా గాంధీ, కర్నాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య పాల్గొననున్నారు. ఈ నెల 28వ తేదీ నుంచి నవంబర్ 1వ తేదీ వరకు బస్సు యాత్ర సాగనుంది. 28, 29 తేదీల్లో కర్నాటక సిఎం సిద్ధరామయ్య బస్సు యాత్రలో పాల్గొంటారు.30, 31 తేదీల్లో ప్రియాంక గాంధీ, వచ్చే నెల 1న రాహుల్ గాంధీ బస్సు యాత్రలో పాల్గొంటారు.

 ఉమ్మడి మహబూబ్ నగర్, మెదక్, రంగారెడ్డి, నల్లగొండ జిల్లాలను కవర్ చేస్తూ ఈ బస్సుయాత్ర కొనసాగనుంది. రూట్ మ్యాప్ ను పీసీసీ సిద్ధం చేస్తోంది. బస్సుయాత్రకు కావాల్సిన ఏర్పాట్లో రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు నిమగ్నమయ్యారు. కర్నాటక బార్డర్ లోని మహబూబ్ నగర్ జిల్లాలో సిద్ధరామయ్య బస్సుయాత్ర ఉండే అవకాశం ఉందని సమాచారం. మొదటి బస్సుయాత్రలో ఉత్తర తెలంగాణ జిల్లాల్లో సాగిన విషయం తెలిసిందే.