ఢిల్లీ నుంచి గల్లీదాక కాంగ్రెస్-బీజేపీ చీకటి ఒప్పందం

ఢిల్లీ నుంచి గల్లీదాక కాంగ్రెస్-బీజేపీ చీకటి ఒప్పందం
  • జగిత్యాల నుంచి మొదలై రాష్ట్రంలోని అన్ని ఎన్నికల్లో కొనసాగుతోంది
  • టీఆర్ఎస్ ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్

జగిత్యాల జిల్లా: మరోసారి  సంచలన వ్యాఖ్యలు చేశారు జగిత్యాల టీఆర్ఎస్ ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్. సోమవారం కార్యకర్తలతో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఢిల్లీ నుంచి గల్లీదాక కాంగ్రెస్-బీజేపీ చీకటి ఒప్పందం చేసుకున్నాయని, జగిత్యాల నుంచి మొదలై రాష్ట్రంలోని అన్ని ఎన్నికల్లో కొనసాగుతోందన్నారు. నిజామాబాద్ నుంచి హుజూరాబాద్ వరకు అదే ఒప్పందంతో ముందుకు సాగుతున్నాయని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ గెలిస్తే కాంగ్రెస్ కు డిపాజిట్ రాదు.. కాంగ్రెస్ గెలిస్తే బీజేపీకి డిపాజిట్ రాదు.. హుజురాబాద్ లో జరిగేది అదే అంటూ  నర్మగర్భ వ్యాఖ్యలు చేశారు. 
నమ్మి పదవులిస్తే పెద్ద నాయకుడైన ఈటల వెన్నుపోటు పొడిస్తే.. యువ నాయకుణ్ని కేసీఆర్ హుజురాబాద్ లో బరిలో నిలబెట్టిండు.. ఇగేమన్నగానీ.. నూరువిధాల గెలుస్తమంటూ కొంత నిర్లిప్తతంగా ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ వ్యాఖ్యలు చేయడం హాట్ టాపిక్ గా మారింది. కార్యకర్తలు అయోమయానికి గురైనట్లు గుర్తించినట్లు ఆయన  ఏదీ ఏమైనా హుజూరాబాద్ లో  మనం గెలుస్తామని కార్యకర్తలకు భరోసా కల్పించే ప్రయత్నం చేశారు.