అహ్మదాబాద్ చేరుకున్న టీమిండియా

అహ్మదాబాద్ చేరుకున్న టీమిండియా
  • వెస్టిండీస్ తో 3 వన్డేలు.. 3 టీ20ల సిరీస్

అహ్మదాబాద్: వెస్టిండీస్ తో మూడు వన్డేల సిరీస్ కోసం టీమిండియా అహ్మాదాబాద్ చేరుకుంది. టీమ్ కు ఎంపికైన ఆటగాళ్లు.. సహాయక సిబ్బంది ఆది, సోమవారాల్లో ఇక్కడకు వచ్చి బయో బబుల్ లో ఎంటర్ అయ్యారని బీసీసీఐ అధికారి ఒకరు చెప్పారు. టీమ్ మొత్తం మూడు రోజులు క్వారంటైన్ లో ఉంటుందన్నారు. వన్డే కెప్టెన్ గా ఎంపికైన తర్వాత రోహిత్ శర్మకు ఇదే ఫస్ట్ వన్డే సిరీస్ కావడం విశేషం. ఈ సిరీస్ లో మూడు వన్డేలు ఈనెల 6, 9, 11వ తేదీల్లో నరేంద్ర మోడీ స్టేడియంలో జరుగుతాయి. అనంతరం 16, 18, 20వ తేదీల్లో కోల్ కతాలో మూడు టీ20ల సిరీస్ ప్లాన్ చేశారు. ఈ సిరీస్ కు స్టేడియం కెపాసిటీలో 75 శాతం మంది ఫ్యాన్స్ కు బెంగాల్ ప్రభుత్వం అనుమతిచ్చింది.