పోలీస్ ఇన్ స్పెక్టర్ను ఢీకొట్టిన ట్రక్

పోలీస్ ఇన్ స్పెక్టర్ను ఢీకొట్టిన ట్రక్

ఢిల్లీలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఢిల్లీ మాదీపూర్ మెట్రో స్టేషన్ సమీపంలో కారును వెనుక నుంచి ట్రక్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఢిల్లీ పోలీస్ ఇస్పెక్టర్ చనిపోయాడు. కారులో టెక్నికల్ సమస్య రావడంతో డ్రైవర్ రోడ్డు పక్కన ఆపాడు. దీంతో  పోలీస్ ఇన్స్ పెక్టర్ రోడ్డుపై నిల్చున్న టైంలో వెనుక నుంచి వచ్చిన ట్రక్ ఢీకొట్టింది.  

ఈ ఘటనలో పోలీస్ అధికారి జబ్బర్ సింగ్ అక్కడిక్కడే మృతి చెందాడు.  ప్రమాదం జరిగిన వెంటనే  ట్రక్కు డ్రైవర్ పరారయ్యాడు. పోలీసులు ట్రక్కును ఆధీనంలోకి తీసుకొని విచారణ చేస్తున్నారు.