చుట్టూ వరద నీరు.. మధ్యలో ఏనుగుపై మావటి

చుట్టూ వరద నీరు.. మధ్యలో ఏనుగుపై మావటి

బిహార్ లో గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలకు అక్కడి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అయితే ఈ తరుణంలోనే ఓ ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. ఏనుగు వీపుపై ఓ వ్యక్తి నదిని ఈదుతూ వచ్చే ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ ఘటన వైశాలిలోని రాఘోపూర్‌లో జరిగింది. అక్కడ వంతెన లేకపోవడం వల్ల ప్రజలు నది దాటేందుకు పడవలు ఉపయోగిస్తుంటారు. అయితే మావటి హఫీజ్‌ తన వద్ద ఉన్న గజరాజుతో సహా పడవ ఎక్కేందుకు డబ్బు లేకపోవడంతో.. తన గజరాజుతో కలిసి గంగానదిని దాటేందుకు యత్నించాడు. అలా ప్రయాణించిన ఆ ఇద్దరూ.. వరద ఉద్దృతి పెరగడంతో కొంతదూరం కొట్టుకుపోయారు. అయినా ఏ మాత్రం సడలక.. ఆ పెరుగుతున్న వరద ప్రవాహంలోనే దాదాపు 3 కిలో మీటర్లు ఈదుకుంటూ... మావటితో పాటు, ఏనుగు కూడా ఒడ్డుకు చేరి, ప్రాణాలతో బయటపడింది.