చేప ప్రసాదం.. తరలివచ్చిన జనం

చేప ప్రసాదం.. తరలివచ్చిన జనం

హైదరాబాద్​ సిటీ, వెలుగు: నాంపల్లి ఎగ్జిబిషన్‌‌‌‌ గ్రౌండ్​లో ఆదివారం చేప ప్రసాదం పంపిణీకి జనం భారీగా తరలివచ్చారు. రాష్ట్రంలోని నలుమూలలతోపాటు యూపీ, అస్సాం, బిహార్, మహారాష్ట్ర, ఢిల్లీ, హర్యానా, ఛత్తీస్ గడ్,  కర్నాటక తదితర రాష్ట్రాల నుంచి వచ్చిన ఆస్తమా బాధితులతో ఎగ్జిబిషన్ గ్రౌండ్ కిక్కిరిసిపోయింది. ఎక్కడా ఇబ్బందులు పడకుండా అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఆర్టీసీ ప్రత్యేకంగా 60 బస్సులను నడిపింది. సోమవారం కూడా 80 బస్సులను నడపనుంది.  స్వచ్ఛంద సంస్థలు వాటర్, టిఫిన్, భోజన సదుపాయాలను మూడుపూటలా కల్పించారు. నేడు ఉదయం 10 గంటల వరకు కూడా  చేప ప్రసాదం పంపణీ చేయనున్నట్లు బత్తిని కుటుంబసభ్యులు తెలిపారు.  

ఏర్పాట్లు బాగున్నాయ్..

చేప ప్రసాదం కోసం ఫస్ట్​టైమ్​మా అమ్మతో కలిసి అస్సాం నుంచి వచ్చా. పంపిణీ తేది తెలుసుకొని ముందే రైల్వే రిజర్వేషన్  చేసుకున్నాం. ఒక రోజు ముందు వచ్చి ఇక్కడ వెయిట్ చేశాం. చేప ప్రసాదం వేసుకొని తిరిగి ఫ్లైట్ ద్వారా వెళ్తున్నాం. ఏర్పాట్లు బాగున్నాయి.–బంధనా బిస్వాస్, అస్సాం

రెండోసారి వేసుకున్న....

మా ఇంటి పెద్దలు  రెగ్యులర్ గా చేప ప్రసాదం తీసుకుంటారు. నేను లాస్టియర్​తోపాటు ఈసారి కూడా తీసుకున్నా. ఎక్కడి నుంచో  ఎంతో మంది విశ్వాసంతో చేప ప్రసాదం కోసం వస్తున్నారు. ఇక్కడే ఉన్న మనం ఎందుకు తీసుకోవద్దని వచ్చా. - శ్రవణ్, గాజులరామారం