
రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం పెద్ద చెరువు తూమ్ ను ఓపెన్ చేయొద్దంటూ మత్య్సకారులు ఆందోళన చేపట్టారు. 50 ఏళ్ల తర్వాత చెరువు పూర్తి స్థాయిలో నిండిందని ఇప్పుడు తూం తెరిస్తే... తమ జీవనాధారం కోల్పొతామంటూ ధర్నాకు దిగారు. ఇబ్రహీంపట్నం, హైదరాబాద్ కు వచ్చే రోడ్డుపై మత్స్యకారులు ఆందోళనకు దిగటంతో భారీగా ట్రాఫిక్ జాం అయ్యింది. దీంతో ఆందోళనకారులను అదుపులోకి తీసుకున్న పోలీసులు స్టేషన్ కు తరలించారు.
దాదాపు 50ఏళ్ల తర్వాత ఈ ఏడాదే ఇబ్రహీంపట్నం పెద్ద చెరువు నిండటంతో...చుట్టు పక్కల గ్రామాల ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అయితే చెరువు నిండటంతో శిఖం భూముల్లో నిర్మించిన నిర్మాణాలు కూడా మునిగిపోయాయి. వారి ఒత్తిడితోనే మున్సిపల్ కమిషనర్..... తూం ఓపెన్ చేసేందుకు యత్నిస్తున్నారని మత్స్యకారులు. ఆరోపించారు చాలా కాలం తర్వాత నిండిన చెరువును ఖాళీ చేయడం మానుకోవాలన్నారు. మరోసారి FTL ను ఫిక్స్ చేయాలని..చెరువు నుంచి వాటర్ లీకేజీ కాకుండా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు.