హైదరాబాద్ జూబ్లీహిల్స్ లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రి సిబ్బంది చేతివాటం ప్రదర్శించారు. చికిత్స కోసం వచ్చిన ఓ మహిళ నుంచి రూ. 50లక్షల విలువ చేసే డైమండ్ ఉంగరాన్ని చోరీ చేశారు. జూబ్లీహిల్స్ లోని ఎఫ్ఎమ్ఎస్ దంత ,చర్మ ఆస్పత్రిలో ఈ ఘటన జరిగింది.
జూన్ 27న ఎఫ్ఎమ్ఎస్ ఆస్పత్రికి బంజారాహిల్స్ కు చెందిన ఓ మహిళ చికిత్స కోసం వచ్చింది. చికిత్స చేసేటప్పుడు చేతికున్న డైమండ్ రింగ్ ను తీసి పక్కన పెట్టిన ఆ మహిళ.. తర్వాత ఉంగరాన్ని మరిచిపోయి ఇంటికి వెళ్లింది. ఆలస్యంగా ఉంగరం విషయాన్ని గుర్తించిన ఆ మహిళ హాస్పిటల్ కు వెళ్లి సిబ్బందిని నిలదీసింది. సిబ్బంది సమాధానం చెప్పకపోవడంతో జూబ్లీహిల్స్ పోలీసులకు కంప్లైంట్ ఇచ్చంది. పోలీసులు ఆస్పత్రి సీసీ కెమెరాలు తనిఖీ చేస్తుండగా.. అందులో పనిచేసే ఓ మహిళా సిబ్బంది నిజం ఒప్పుకుంది. టిష్యూ పేపర్లో ఉంగారాన్ని చుట్టి పర్స్ లో దాచిపెట్టానని.. అనంతరం భయంతో బాత్రూం కామెడ్ లో పడేసానని పోలీసులకు తెలిపింది. దీంతో పోలీసులు బాత్రూం తవ్వి ఉంగారాన్ని వెలికి తీశారు . మహిళను అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారిస్తున్నారు.