పదేళ్లలో కేంద్రం తెలంగాణకు చేసిందేమీ లేదన్నారు సీఎం రేవంత్ రెడ్డి. విభజన హామీలు ఎందుకు అమలు చేయలేదో చెప్పే ప్రధాని మోదీ రాష్ట్రంలో ప్రచారానికి రావాలని డిమాండ్ చేశారు.
మల్కాజిగిరి కాంగ్రెస్ అభ్యర్థి సునీతా మహేందర్ రెడ్డికి మద్దతుగా ఎల్బీనగర్ లో రోడ్ షో నిర్వహించారు సీఎం రేవంత్. మళ్లీ మోదీ అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని మారుస్తారని ఆరోపించారు. గుడిలో ఉండాల్సిన దేవుడిని బీజేపీ నేతలు రోడ్డు మీదకి ఎందుకు తీసుకువస్తున్నారని ప్రశ్నించారు.
షెడ్డుకు పోయిన కారు ఇక రాదని.. ప్రజలను మోసం చేసేందుకు కేసీఆర్ బయలుదేరారని సీఎం రేవంత్ మండిపడ్డారు. మూసీ నది ప్రక్షాళన, మెట్రో పొడిగింపు, 118 జీఓ, ఎల్బీనగర్ లో ఉన్న ప్రతి ఒక్క సమస్య తీర్చే బాధ్యత తనేదేనని చెప్పారు. కాంగ్రెస్ పార్టీతోనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని చెప్పారు సీఎం.