హ్యూమన్ రైట్స్ కమిషన్ చైర్మన్ జస్టిస్ చంద్రయ్య విస్మయం
పద్మారావునగర్, వెలుగు: ఇండ్ల మధ్య స్క్రాప్ గోదాములకు అనుమతులు ఇవ్వడం ఘోరమైన తప్పిదమని, అధికారుల నిర్లక్ష్యానికి 11 మంది అమాయక కార్మికులు మృతి చెందారని రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ చైర్మన్ జస్టిస్ చంద్రయ్య అభిప్రాయపడ్డారు. సంచలనం సృష్టించిన బోయిగూడ ఫైర్ యాక్సిడెంట్ గోదాంను శుక్రవారం ఆయన పరిశీలించి పోలీసులు, ఫైర్, రెవెన్యూ అధికారులతో పాటు స్థానికుల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. సిటీలో అనుమతులు లేని, జనావాసాల మధ్యనున్న గోడౌన్ లను గుర్తించి సీజ్ చేయాలని సూచించారు. మృతుల కుటుంబాలకు ఎక్స్ గ్రేషియా త్వరగా అందించాలన్నారు.