రూ. 20 వేల కోట్లతో కేరళ కొవిడ్​ ప్యాకేజీ

రూ. 20 వేల కోట్లతో కేరళ కొవిడ్​ ప్యాకేజీ

వ్యవసాయం, పేదరిక నిర్మూలకే కేటాయింపు లెక్కువ
తిరువనంతపురం: కేరళ రాష్ట్ర ప్రభుత్వం కొవిడ్​ పునరుద్ధరణ ప్యాకేజీ ప్రకటించింది. కరోనా సెకండ్​ వేవ్ నేపథ్యంలో ప్రజల ఆరోగ్యం, సామాజిక, ఆర్థిక సవాళ్ల పరిష్కారం కోసం రూ.20 వేల కోట్లతో బడ్జెట్​లో ప్రత్యేక ప్యాకేజీని కేటాయించినట్లు శుక్రవారం ఆర్థిక మంత్రి కేఎన్​ బాలగోపాల్ తెలిపారు. ఇందులో వ్యవసాయం, పేదరిక నిర్మూలనకు గణనీయమైన కేటాయింపులు చేసింది. దీంతో పాటు అందరికీ ఆహారం, ఉపాధి, ఫ్రీ వ్యాక్సినేషన్​ కోసం కూడా బడ్జెట్​ కేటాయించింది. 18 ఏండ్లు పైబడిన వారందరికీ ఫ్రీ వ్యాక్సిన్ వేసేందుకుగాను అదనంగా రూ.1,500 కోట్లు అలాట్​ చేసింది. కేరళలో కరోనా హెల్త్​ ఎమర్జెన్సీ ఉన్నందున ఆరు దశల వ్యూహాన్ని ఆ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. కరోనా థర్డ్​ వేవ్ ను కూడా ఎదుర్కొనేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. కరోనా మహమ్మారి కారణంగా రాష్ట్రం తీవ్ర ఆర్థిక సంక్షోభంలో ఉన్నప్పటికీ 2021–22 బడ్జెట్​లో కొత్త పన్నులు విధించకూడదని నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి బాలగోపాల్​ తెలిపారు. రాష్ట్రంలో హెల్త్ ఎమర్జెన్సీ సమస్యను పరిష్కరించడానికి రూ.2,800 కోట్లు, కరోనా టైమ్​లో ఉపాధి కోల్పోయి ఇబ్బంది పడుతున్నోళ్ల కోసం రూ.8,990 కోట్లు కేటాయించారు. అవసరమైన వారికి లోన్లు, వడ్డీ రాయితీల కోసం రూ.8,300 కోట్లు అలాట్​ చేశారు. ప్రతి తాలుకా, జిల్లా, జనరల్​ హాస్పిటళ్లల్లో 10 బెడ్లతో ఐసోలేషన్​ వార్డులు ఏర్పాటుకు రూ.636.5 కోట్లు, మూడు మెడికల్​ కాలేజీల్లో ఐసోలేషన్​ బ్లాకులు నిర్మాణానికి మరో రూ. 50 కోట్లు కేటాయించారు. 
వ్యవసాయం, ఎంఎస్​ఎంఈలకు రూ.100 కోట్లు
వ్యవసాయం, ఎంఎస్​ఎంఈ తదితరులకు తక్కువ వడ్డీకి రుణాలు ఇచ్చేందుకు, వడ్డీ మాఫీకి రూ.100 కోట్లను మంత్రి కేటాయించారు. చిన్న తరహా సంస్థ లు, స్టార్టప్​ల అభివృద్ధి కోసం రూ.100 కోట్ల వెంచర్ క్యాపిటల్ ఫండ్​ను ప్రతిపాదించారు. ఎస్సీ, ఎస్టీ ​పారిశ్రామికులకు తక్కువ వడ్డీ రుణాలిచ్చేందుకు రూ.10 కోట్లు కేటాయించారు. పర్యాటకం అభివృద్ధికి రూ.30 కోట్లు, ప్రస్తుతం ఉన్న రూ.100 కోట్లతో పాటు అదనంగా రూ.50 కోట్లను పర్యాటక మార్కెటింగ్​ కోసం అలాట్​ చేశారు. 
12 కోట్ల పనిదినాలు..
ఉపాధి హామీ పథకం ద్వారా కనీసం 12 కోట్ల పని దినాల అమలుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని మంత్రి చెప్పారు. ఆన్​లైన్​ టీచింగ్​ తదితరాల కోసం10 కోట్లు, కేరళ నాలెడ్జ్​ సొసైటీలో భాగంగా నైపుణ్యాలను పెంచడానికి నాలెడ్జ్​ఎకానమీ ఫండ్​ కేవుహాన్ ల్యాబ్ గుట్టు.. ఫౌచీ దాచిండా?టాయింపులను 300 కోట్లకు పెంచామన్నారు.