
గచ్చిబౌలి, వెలుగు : తీవ్ర అస్వస్థతకు గురైన జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ గచ్చిబౌలి ఏఐజీ ఆసుపత్రి ఐసీయూలోనే చికిత్స పొందుతున్నారు. ఏఐజీ వైద్యుల బృందం గోపీనాథ్కు చికిత్సను అందజేస్తున్నారు. శుక్రవారం మంత్రి శ్రీధర్బాబు, నగర మేయర్విజయలక్ష్మీ ఆసుపత్రికి చేరుకొని గోపీనాథ్ కుటుంబసభ్యులను పరామర్శించారు.
అనంతరం ఎమ్మెల్యే ఆరోగ్య పరిస్థితి గురించి ఆసుపత్రి వైద్యులను ఆడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్బాబు మాట్లాడుతూ.. జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే గోపినాథ్ తనకు అత్యంత సన్నిహితుడని, ఆయన తీవ్ర అస్వస్థతకు గురికావడం బాధాకరమన్నారు. త్వరలోనే గోపినాథ్ కోలుకొని ప్రజాసేవ చేసేందుకు వస్తారని పేర్కొన్నారు.