ప్రాణాలు తీస్తున్న జీవో 317ను వెనక్కి తీసుకోవాలి

ప్రాణాలు తీస్తున్న జీవో 317ను వెనక్కి తీసుకోవాలి

జీవో నంబర్ 317  మరో ప్రభుత్వ ఉద్యోగి ఉసురు తీసిందన్నారు బీజేపీ ఎంపీ అర్వింద్. భీంగల్ మండలం బాబాపూర్ గ్రామంలో బేతల సరస్వతి(36) అనే ఉపాధ్యాయురాలు ఆత్మహత్య చేసుకోవడం బాధాకరమన్నారు. 317 జీవోతో కామారెడ్డికి ట్రాన్స్ ఫర్ అవ్వడంతో మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకున్నట్లు కుటుంబ సభ్యుల వెల్లడించారు. టీచర్ కు  ఇద్దరు కవల పిల్లలు ఉన్నారని.. వారి పరిస్థితిని తలుచుకుంటే వేదనతో పాటు ఆగ్రహం కలుగుతోందన్నారు. సరైన సంప్రదింపులు చేయకుండా, విధి విధానాలు తెలుపకుండా ప్రభుత్వం ఉద్యోగులను అయోమయంలో పడేసిందన్నారు ఎంపీ అర్వింద్. ఉపాధ్యాయుల ఉసురు తీస్తున్న జీవో317 ని తక్షణమే వెనక్కి తీసుకోవాలన్నారు. జీవో వెనక్కి తీసుకొని, సవరణలు చేపట్టకపోతే ఉద్యోగుల కోసం బీజేపీ పోరాటం కొనసాగుతుందన్నారు. ప్రభుత్వ ఉద్యోగస్థులెవరూ మనోబలం కోల్పోకూడదన్నారు.