
న్యూఢిల్లీ: జాతీయ రహదారులపై టూ వీలర్స్కు కూడా టోల్ ట్యాక్స్ విధించనున్నారని జరుగుతున్న ప్రచారంపై కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ గురువారం క్లారిటీ ఇచ్చారు. టూ-వీలర్లకు టోల్ చార్జీల నుంచి మినహాయింపు కొనసాగుతుందని, అటువంటి ప్రతిపాదనేదీ ప్రభుత్వం వద్ద లేదని వెల్లడించారు. ‘కొన్ని మీడియా సంస్థలు నిజానిజాలను నిర్ధారించుకోకుండా తప్పుడు వార్తలు ప్రచారం చేస్తున్నాయి. ఇది ఆరోగ్యకరమైన జర్నలిజం కాదు’ అని గడ్కరీ అన్నారు.
మరోవైపు నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎన్హెచ్ఏఐ) కూడా ఈ వార్తలను ఖండించింది. టూ-వీలర్లకు టోల్ చార్జీలు ఉండవని ఒక ప్రకటనలో పేర్కొంది. ఇదిలా ఉండగా, వ్యక్తిగత వాహనాలు.. కార్లు, జీపులు, వ్యాన్ల కోసం ఎన్హెచ్ఏఐ రూ.3 వేల వార్షిక ఫాస్టాగ్ పాస్ను ఈ ఏడాది ఆగస్టు 15 నుంచి ప్రవేశపెడుతున్నది. ఈ పాస్ కమర్షియల్ వాహనాలకు వర్తించదు. ఈ పాస్ యాక్టివేషన్, రెన్యువల్ వివరాలను ఎన్హెచ్ఏఐ త్వరలో అధికారిక వెబ్సైట్లో ఉంచనుంది.