Fire Accident : బిల్డింగ్లో గౌడౌన్కు పర్మిషన్ లేదు : జీహెచ్ఎంసీ అధికారులు

Fire Accident : బిల్డింగ్లో గౌడౌన్కు పర్మిషన్ లేదు : జీహెచ్ఎంసీ అధికారులు

సికింద్రాబాద్ అగ్నిప్రమాదం ఘటనలో మంటలు ఇంకా అదుపులోకి రాలేదు. మంటలను అదుపు చేసేందుకు సిబ్బంది శ్రమిస్తున్నారు. అయితే అగ్నిప్రమాదం జరిగిన భవనానికి సంబంధించి 4, 5 అంతస్తులకు అనుమతి లేదని జీహెచ్ఎంసీ అధికారులు ధృవీకరించారు. రేపు బిల్డింగ్ను జీహెచ్ఎంసీ ఇంజనీరింగ్, టౌన్ ప్లానింగ్ అధికారులు పరిశీలించనున్నారు. బిల్డింగ్ యజమానిపై క్రిమినల్ కేసు పెట్టే అవకాశం ఉంది. ఐదు అంతస్థుల బిల్డింగ్లో ఫైర్ సేఫ్టీ నిబంధనలు శూన్యమని తెలుస్తోంది. కార్ డెకర్స్, స్పోర్ట్స్ స్టోర్ లకు మాత్రమే ట్రేడ్ లైసెన్స్ ఉన్నట్లు జీహెచ్ఎంసీ అధికారులు తెలిపారు. గోడౌన్కు ఎటువంటి పర్మిషన్ లేదని స్పష్టం చేశారు. మరోవైపు బిల్డింగ్ పరిసర ప్రాంత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. వారికి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.