ఉస్మానియా హాస్పిటల్​కు టెండర్లు పిలిచిన ఆర్​అండ్​బీ

ఉస్మానియా హాస్పిటల్​కు టెండర్లు పిలిచిన ఆర్​అండ్​బీ
  • ఈ నెల 27 వరకు గడువు

హైదరాబాద్, వెలుగు: గోషామహల్ లో నిర్మించనున్న ఉస్మానియా హాస్పిటల్​కు ఆర్ అండ్ బీ టెండర్లు పిలిచింది. టెండర్ దాఖలుకు ఈ నెల 27 వరకు గడువు విధించారు. అదే రోజు టెక్నికల్ బిడ్ ఓపెన్ చేసి, వచ్చే నెల1న ఫైనాన్షియల్ బిడ్​ను ఓపెన్ చేయనున్నారు. ఈ మేరకు ఆర్ అండ్ బీ హెడ్ క్వార్టర్స్ సర్కిల్ ఎస్ఈ టెండర్ నోటిఫికేషన్ జారీ చేశారు. హైదరాబాద్‌‌లోని గోషామహల్‌‌లో కొత్తగా నిర్మించనున్న ఉస్మానియా జనరల్ హాస్పిటల్ నిర్మాణానికి సీఎం రేవంత్ రెడ్డి ఈ ఏడాది జనవరి 31న శంకుస్థాపన చేశారు. 

దీనిని 26 ఎకరాల విస్తీర్ణంలో రూ.2700 కోట్లతో  32 లక్షల చదరపు అడుగులతో 2,000 బెడ్స్ సామర్థ్యంతో నిర్మించనున్నారు. రెండేండ్లలో పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ ఆసుపత్రిలో 29 ప్రధాన, 12 చిన్న ఆపరేషన్ థియేటర్లు, రోబోటిక్ సర్జరీ, ట్రాన్స్‌‌ప్లాంట్ థియేటర్, హెలిప్యాడ్, సీవేజ్ ట్రీట్‌‌మెంట్ ప్లాంట్, బయోమెడికల్ వేస్ట్ మేనేజ్‌‌మెంట్ వంటి అత్యాధునిక సౌకర్యాలు ఉండనున్నాయి.