ఎయిర్‌పోర్ట్‌ ఘటనపై స్పందించిన శ్రుతి హాసన్‌.. వెంటపడ్డ అగంతుకుడు ఎవరంటే?

ఎయిర్‌పోర్ట్‌ ఘటనపై స్పందించిన శ్రుతి హాసన్‌.. వెంటపడ్డ అగంతుకుడు ఎవరంటే?

టాలీవుడ్ లో శృతి హాసన్(Shruthi Hasan) వరుస చిత్రాలతో దూసుకుపోతోంది. కెరీర్ మొదటిలో ఆమెకు ఎన్నో పరాజయాలు ఎదురయ్యాయి. పరాజయలకు క్రుంగి పోకుండా మరింత హార్డ్ వర్క్ చేసి తెలుగులో టాప్ హీరోయిన్గా దూసుకుపోతుంది. రీసెంట్గా శృతి హాసన్ని ముంబయ్ ఎయిర్ పోర్ట్లో గుర్తు తెలియని వ్యక్తి వెంటపడ్డ విషయం తెలిసిందే. తన కార్ పార్కింగ్ ఏరియా వరకి వెంబడించిన ఆ వ్యక్తి వీడియో.. సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది.

లేటెస్ట్ గా శ్రుతిహాసన్ ఇన్ స్టా వేదికగా ఫ్యాన్స్ తో ముచ్చటించారు. కాగా ఎయిర్ పోర్ట్లో వెంటపడ్డ వ్యక్తి ఎవరనేది అభిమాని అడగగా..శృతి స్పందిస్తూ..అసలు నను వెంబడించిన వ్యక్తి ఎవరో నాకు తెలియదు. నేను  ఎయిర్పోర్ట్లో నడుచుకుంటూ వస్తుండగా.. ఒక గుర్తు తెలియని వ్యక్తి నన్ను ఫాలో అయ్యాడు. జస్ట్ ఫోటో కోసం అనుకున్న..అంతలోనే ఫోటో గ్రాఫర్ ఆమె పక్కకి వెళ్లి నిల్చోమని చెప్పినపుడు..అతను మరి క్లోజ్గా వచ్చాడు.

ALSO READ : రైల్వే కూలీగా రాహుల్ గాంధీ.. ఢిల్లీ రైల్వేస్టేషన్లో లగేజీ మోశాడు

దీంతో చాలా అసౌకర్యంగా ఫీల్ అయ్యాను. వెంటనే అక్కడి నుంచి వెళ్ళిపోయాను. నార్మల్గా నాకు బాడీగార్డ్స్ ను పెట్టుకోవడం అస్సలు ఇష్టం ఉండదు. నాకు స్వేచ్ఛ కావాలి అని బాడీ గార్డ్స్ ఆలోచన ఎప్పుడు రాలేదు. కానీ,ఇప్పుడు బాడీగార్డ్స్ విషయంలో ఆలోచించే సమయం వచ్చింది..అని శృతి హాసన్ పేర్కొన్నారు.

రీసెంట్ గా శృతి హాసన్ బాలయ్య బాబుతో వీరసింహా రెడ్డి, చిరు వాల్తేరు వీరయ్య చిత్రాల తో తిరుగులేని సూపర్ హిట్స్ సొంతం చేసుకుంది. ప్రస్తుతం శృతి హాసన్ ప్రభాస్ కి జోడిగా పాన్ ఇండియా మూవీ సలార్(Salar) లో నటిస్తున్న విషయం తెలిసిందే. అలాగే నాని(Nani) హీరోగా తెరకెక్కుతోన్నహాయ్‌ నాన్న మూవీలోనూ శ్రుతి హాసన్‌ కనిపించనున్నారు.