గంటలో పెళ్లి.. 25 లక్షల డబ్బు, 25 తులాల గోల్డ్‌తో వరుడు జంప్

గంటలో పెళ్లి.. 25 లక్షల డబ్బు, 25 తులాల గోల్డ్‌తో వరుడు జంప్

సంగారెడ్డి జిల్లా : ప్రేమించిన వ్యక్తితో లేచిపోవడంతోనో.. ఒప్పుకున్న వరకట్నం డబ్బులు సమకూర్చలేదనో పెళ్లిళ్లు ఆగిపోయిన సంఘటనలు చేసే ఉంటాం. కానీ.. గంటలో పెళ్లి ఉందనగా ఓ పెళ్లి కొడుకు పక్కా ప్లాన్‌తో భారీగా నగదు, బంగారంతో ఎస్కేప్ అయ్యాడు. వివాహానికి గంట ముందు వరుడు పరారైన ఈ ఘటన సంగారెడ్డి జిల్లాలో జరుగగా ఆలస్యంగా వెలుగుచూసింది.

సంగారెడ్డి జిల్లా కంది మండలం, చిమ్నాపూర్ గ్రామానికి చెందిన యువతికి కొండాపూర్ మండలం, మల్కాపూర్‌కు చెందిన  మాణిక్ రెడ్డితో ఈ నెల 12న వివాహానికి పెద్దలు నిశ్చయించారు. మరికాసేపట్లో పెళ్లి జరుగుతుందనగా.. గంట ముందు కట్నంగా ఇచ్చిన రూ. 25 లక్షల నగదు, 25 తులాల బంగారంతో వరుడు పరారయ్యాడు. దీంతో వివాహం ఆగిపోయింది. పచ్చటిపందిరిలో వధువు కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు. ఇక పెళ్లి కూతురి బాధ వర్ణనాతీతం. వధువు తల్లిదండ్రులు పోలీసులు, న్యాయసేవాధికార సంస్థ కార్యాలయంలో పిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు పోలీసులు.