![లంచం తీసకుంటూ రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డ మిధాని అదనపు జనరల్ మేనేజర్ టి.జానకీరావు](https://static.v6velugu.com/uploads/2024/05/111_7mHJut5vQf.jpg)
హైదరాబాద్ మిదాని లో రైడ్స్ నిర్వహించారు సీబీఐ అధికారులు. పెస్ట్ కంట్రోల్ పనుల కోసం తన నెలవారీ బిల్లును ఫార్వర్డ్ చేసేందుకు కాంట్రాక్టర్ నుంచి రూ.35 వేలు లంచం తీసుకుంటుండగా సీబీఐ మిధాని అదనపు జనరల్ మేనేజర్ టి.జానకీరావును రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుంది. ఏప్రిల్ 4న మెహదీపట్నంలోని ప్రెసిషన్ ఫ్యూమిగేషన్ సర్వీసెస్ మేనేజింగ్ డైరెక్టర్ ఎన్.శ్రీనివాస రెడ్డి ఫిర్యాదు మేరకు సీబీఐ చర్యలు చేపట్టింది.
ఆయన ఆ అధికారితో మాట్లాడిన సంభాషణను రికార్డింగ్లతో కూడిన మైక్రో SD కార్డ్ను సీబీఐకు సమర్పించారు. జానకీరావుపై కన్నెసిన సీబీఐ అధికారులు రైడ్స్ చేశారు. ఈ తనిఖీల్లో రూ. 35 వేల లంచం జానకీరావు తీసుకుంటుండగా పట్టుకున్నారు.
ఫిర్యాదుదారు నుంచి 2024 మార్చి 2, మార్చి 3 తేదీల్లో ఉద్యోగి ఎ. నారాయణ ద్వారా జానకీరావు ఒక్కొక్కరి నుంచి రూ.30 వేల తీసుకున్నారని, మరో సారి లంచం డిమాండ్ చేశారని సీబీఐ అధికారులు తెలిపారు. జానకీరావుపై దర్యాప్తు చేసి కేసు నమోదు చేయనున్నారు సీబీఐ అధికారులు.