సీఎం జగన్ ఇంట్లో ముగిసిన రాజశ్యామల చండీయాగం

సీఎం  జగన్ ఇంట్లో ముగిసిన రాజశ్యామల చండీయాగం

తాడేపల్లిలో 41 రోజులుగా 45 మంది వేద పండితులతో నిర్వహించిన శ్రీ మహా రుద్ర సహిత రాజశ్యామల సహస్ర చండీయాగం పూర్తయింది. వేదపండితులు సీఎం జగన్ కు వేద ఆశీర్వచనం అందజేశారు. బ్రహ్మశ్రీ నల్లపెద్ది శివరామ ప్రసాద్ శర్మ ఆధ్వర్యంలో డా.వరప్రసాద్ రెడ్డి, విజయ శారద రెడ్డి దంపతులు, రక్ష ఫౌండేషన్ వ్యవస్థాపకులు పడమట సురేష్ బాబు సహకారంతో సహస్ర చండీయాగం విజయవంతంగా నిర్వహించారు పండితులు. చండీయాగం, రాజశ్యామల యాగం వంటివి చేసేవారు.. రాష్ట్ర క్షేమం, ప్రజా సంక్షేమం కాంక్షించి ఈ యాగం చేస్తుంటారని చెబుతారు. ఈ యాగాన్ని ఏడాది కాలం చేయొచ్చు.. లేదా మండలం రోజులు అంటే 41 రోజులు చేయడానికి వీలుంటుంది. లేదా 21 రోజులు, 16 రోజులు, 3 రోజులు కూడా వీలును బట్టి చేస్తుంటారు.