30న అహంకారానికి పాతరేసే రోజు  

30న అహంకారానికి పాతరేసే రోజు  

కరీంనగర్ :  బీజేపీ కార్యకర్తలకు డబ్బులు ఆశలు చూపి తమవెంట రావాలని టీఆర్ఎస్ నేతలు నీచపు రాజకీయాలు చేస్తున్నారన్నారు ఈటల రాజేందర్. బుధవారం జమ్మికుంట మున్సిపల్ పరిధిలోని రామన్నపల్లిలో జరిగిన ఎన్నికల ప్రచారంలో మాట్లాడిన ఈటల రాజేందర్.. రాజకీయ నాయకులకు వెళగట్టి తీసుకెళ్లి కండువాలు కప్పే నీచపు సంస్కృతి ఇప్పుడే చూస్తున్నామన్నారు. కేసీఆర్ ఉద్యోగాలు ఇవ్వకపోగా.. ఇస్తామన్న నిరుద్యోగ భృతి కూడా ఇవ్వడం లేదన్నారు. 2018లో నిరుద్యోగ భృతి ఇస్తామని హామీ ఇచ్చి యువత ఓట్లు కొళ్లగొట్టారన్నారు.  హామీ నెరవేర్చి ఉంటే... 80-90 వేలు వాళ్ల ఖాతాలో జమ అయ్యేవన్నారు.  ఇప్పుడు డబ్బుకు ఓట్లు వేస్తారనే చిల్లర ఆలోచనతో కేసీఆర్ ఉన్నారన్న ఈటల.. కొడంగల్, నారాయణఖేడ్, హుజుర్ నగర్, నాగార్జున సాగర లో ఇలాగే మీరు గెలవచ్చు కానీ.. ఇక్కడ సాధ్యం కాదన్నారు. అవసమైతే మీకే ఐదువేలు, లిక్కరు బాటిల్ మా ప్రజలు ఇస్తారు తప్ప.. తమ ఆత్మను అమ్ముకోరన్నారు. ఈ విషయం ఈనెల 30న తేలుతుందని ఈటల​ ఆశాభావం వ్యక్తం చేశారు.

మీరు ఇస్తే డబ్బులు తీసుకుంటారు కావచ్చు కానీ.. మీకు మాత్రం ఓటు వేయరన్నారు.  దసరాకు సీసాతో పాటు.. మూడు కుటుంబాలకు ఓ గొర్రెపిల్ల ఇస్తారట..పండుగ ఖర్చు కోసం 500 నుంచి 2 వేలు ఇస్తారట. . తర్వాత ఓటుకు 20 వేల నుంచి 50 వేలు ఇస్తారట.. ఇస్తే తీసుకోండన్నారు.  అవి కేసీఆర్ భూమి అమ్మినవో, చెమటోడ్చి సంపాదించిన డబ్బులో కాదని..అవి మన డబ్బులే అన్నారు. అక్రమంగా కూడబెట్టి మళ్లీ మనకే పంపిస్తున్నారని తెలిపారు.  కానీ దుర్మార్గంగా తెల్లబట్టలో పసుపు పెట్టి ప్రమాణం చేయించుకుంటారని.. ఆ పని మాత్రం చేయకండన్నారు. ధర్మం మాత్రం తప్పకండని.. నేను ఏమీ అభివృద్ధి చేయలేదట. మీకు ఆ పనులు తెలుసు కదా అన్నారు. ఇది గంభీరమైన సందర్భం. 5 నెలల 15 రోజులుగా కొట్లాడుతున్నా అన్నారు.  ఎన్నికల్లో నెల రోజులకే దమ్ము వస్తుందని.. కానీ కేసీఆర్ డబ్బులతో, అధికార యంత్రాంగంతో మనం పెనుగులాడుతున్నామన్నారు.  చావనైనా చస్తా కానీ కేసీఆర్ కు లొంగుపోను అన్నారు. వెయ్యి కోట్లు ఖర్చు చేసినా.. మీరెన్ని పథకాలు ఇచ్చినా.. నీవు మోకాళ్ల మీద నడిచినా ఇక్కడి ప్రజలు మీకు ఓట్లు వేయరన్నారు. మా వాళ్లకు అంత తెలివి లేదనుకుంటున్నావా? ఇక్కడికి వచ్చే ప్రచారం చేసే ఎమ్మెల్యేలను.. ఇక్కడ అమలయ్యే పథకాలు, పనులు జరుగుతున్నాయా అని ప్రశ్నించాలన్నారు.

కేసీఆర్ ప్రగతి భవన్ లో కూర్చుని జీవోలు, డబ్బు సంచులు హరీశ్ రావుకు ఇస్తున్నాడని..  కత్తి కూడా హరీశ్ రావుకు ఇచ్చి మనల్ని పొడవమని పంపించాడన్నారు. నాయకులకు బుద్ధి చెప్పే రోజు ఈనెల 30 అన్నారు. వీళ్లెంత లంగమాటలు మాట్లాడుతున్నారో మనకు అర్థమై కూడా వాళ్ల మాటలు విందామా? అన్నారు. మీరు అంతిమంగా మాత్రం ధర్మం తప్పకండన్నారు. ఊసరవెళ్లులంతా ఒకవైపు.. ధర్మాన్ని నమ్ముకునేవాళ్లంతా ఒకవైపు ఉండి కేసీఆర్ అహంకారాన్ని దెబ్బకొట్టాలన్నారు. లేకుంటే పిల్లలకు ఉద్యోగాలురావని... వడ్లు కొననంటున్నాడు. నేను రాజీనామాచేసి హుజురాబాద్ లో దెబ్బకొడితే.. మీకు ఎన్నో పథకాలు వచ్చాయన్నారు.  రేపు నేను గెలిస్తే... నీ నిరంకుశత్వం, నీ అహంకారం నాశమైపోతుందని తెలిపారు.  ఇది  నా శాపం కాదని.. ప్రజలు శాపం పెట్టే రోజులొచ్చాయన్నారు.  మీరు ధర్మం తప్పకుండా ఎవరివల్ల ఇవన్నీ వస్తున్నాయో తెలుసుకుని ఓటేయాలన్నారు. మీ మీద ప్రేమతో ఇవన్నీ ఇవ్వడం లేదని.. నేను అసెంబ్లీలో కనిపించకూడదన్ననీచమైన కుట్ర ఇదన్నారు. నేనేం తప్పు చేశానని.. పేద ప్రజల తరపున కొట్లాడేవాన్ని నేను అన్నారు. ఉద్యమ సమయంలో పులిబిడ్డలా కొట్లాడానని.. రాబోయే రోజుల్లో కొట్లాడుతానని కేసీఆర్ భయపడుతున్నాడన్నారు.

మీ కుటుంబ పాలన ఇక కొనసాగే అవకాశం లేదని.. మీ కుటుంబపాలన, పద్ధతి నచ్చడం లేదన్నారు. 2023లో మీ పార్టీ గెలవదని.. అంతకంటే ముందు  జరిగే హుజురాబాద్ ఎన్నికల్లో నన్ను ఆశీర్వదించండని కోరారు ఈటల.  ఫించన్లు రావడం లేదని బెదిరిస్తున్నారట.  ఫించన్, రేషన్ కార్డు, దళితబంధు, రైతుబంధు కేసీఆర్ ఇంట్లో నుంచి ఇవ్వడం లేదన్నారు.  ఇదంతా మనం పన్నులు కట్టిన డబ్బు అని.. మన డబ్బుతో ఆయన జల్సా చేసుకుంటున్నాడని తెలిపారు.  బండినీడన వెళ్తున్న కుక్క.. తానే బండిని లాగుతున్నాననుకుంటుందట.   మనతో కేసీఆర్ బతుకుతున్నాడు.. కానీ ఆయనే మనల్ని బతికిస్తున్నానని అనుకుంటున్నాడు. చంద్రబాబు, వై.ఎస్ సీఎం ఉన్నప్పుడు కూడా ఫించన్లు ఇచ్చారు.  దుబ్బాకలో కూడా బీజేపీ గెలిస్తే ఫించన్లు రావని, కరెంట్ మీటర్లు వస్తాయని, రేషన్ కార్డులు పోతాయన్నారు. కానీ పోలేదని గమనించాలన్నారు.   ఇలాంటి మాటలు నమ్మవద్దని.. ప్రజలు చీల్చి చెండాడుతున్నా.. థూ అని ఉమ్మేస్తున్నా వాళ్లకు సిగ్గు రావడం లేదన్నారు.  ఈనెల 30న డబ్బుసంచులు, దౌర్జన్యానికి, అహంకారానికి పాతరేసే రోజు అన్నారు.  ఆడబిడ్డలందరికీ సద్దులబతుకమ్మ, దసరా శుభాకాంక్షలు తెలిపారు ఈటల రాజేందర్.