ఇద్దరు మహిళలను కత్తులతో దారుణంగా నరికిచంపారు

ఇద్దరు మహిళలను కత్తులతో దారుణంగా నరికిచంపారు

కడప జిల్లాలో దారుణం జరిగింది. బ్రహ్మంగారి మఠం మండలం డి నేలటూరులో ఇద్దరు మహిళలను కత్తులతో దారుణంగా నరికిచంపారు గుర్తు తెలియని దుండగులు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని పరిశీలిస్తున్నారు. మృతులను అంజనమ్మ, లక్ష్మీదేవిగా గుర్తించారు. అయితే 2012లో జరిగిన హత్యలకు ప్రతీకారంగానే వీరి హత్యలు జరిగినట్లుగా తెలుస్తోందన్నారు పోలీసులు. ఆస్తుల కోసమే వీరి హత్య జరిగినట్లుగా పోలీసులు ప్రాథమికంగా నిర్థారించారు. వరకట్న వేధింపులతో అంజ‌న‌మ్మ కోడ‌లు ష‌రీఫ్మాను కూతురు లక్ష్మిదేవి సహాకారంతో 2019లో హత్య చేసిందన్న కక్షతోనే ఈ హత్యలు జరిగినట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నట్లు తెలిపారు పోలీసులు.