వాహనాలకు పొల్యూషన్ సర్టిఫికెట్ లేకుంటే జైలుకే

వాహనాలకు పొల్యూషన్ సర్టిఫికెట్ లేకుంటే జైలుకే

దేశ రాజధాని ఢిల్లీలో గాలి కాలుష్యం ప్రమాదకర స్థాయిలో ఉంది. దీన్ని అరికట్టేందుకు ఢిల్లీ ప్రభుత్వం ఇప్పటికే ఎన్నో చర్యలు తీసుకుంది. గతంలో కొన్ని రోజుల పాటు వాహన రిజిస్ట్రేషన్ నంబర్ సరి, బేసి ఆధారంగా రోడ్డుపైకి వచ్చేలా నిబంధనలు అమలు చేశారు సీఎం అరవింద్ కేజ్రీవాల్ . లాక్ డౌన్ సమయంలో గాలి కాలుష్యం చాలా వరకు తగ్గింది. ఇప్పుడు మళ్లీ లక్షలాది వాహనాలు రోడ్లపైకి వస్తుండటంతో కాలుష్యం క్రమంగా పెరుగుతోంది.
 
ఈ క్రమంలోనే  ఢిల్లీ ప్రభుత్వం మళ్ళీ మరో కీలక నిర్ణయం తీసుకుంది. వాహనదారులు తమ వాహనాలకు పొల్యూషన్ టెస్ట్ కచ్చితంగా చేయించాల్సిందేనని హెచ్చరించింది. రోడ్డు మీదకు వచ్చే వాహనాలకు సంబంధించిన పొల్యూషన్ సర్టిఫికెట్ కచ్చితంగా దగ్గర ఉంచుకోవాలని సూచించింది. వాహనాలను తనిఖీ చేసే సమయంలో పొల్యూషన్ సర్టిఫికెట్ లేకుంటే 6 నెలల జైలు శిక్ష లేదా రూ. 10 వేల జరిమానా విధించనుంది. లేదంటే రెండూ విధించే అవకాశం ఉందని హెచ్చరించింది ఢిల్లీ ప్రభుత్వం.