
కరీంనగర్ జిల్లాలో రోజు రోజుకి కరోనా కేసులు పెరుగుతున్నాయి. జమ్మికుంట మున్సిపల్ పరిధిలోని రామన్నపల్లిలో ఆదివారం ఓ వ్యక్తికి కరోనా పాజిటివ్ వచ్చింది. అయితే ఆ వ్యక్తి మోటార్ సైకిల్ పై తిరుగుతూ కూరగాయలు అమ్ముతాడని గుర్తించారు అధికారులు. దీంతో అతడి దగ్గర కూరగాయలు కొన్నవారు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటివరకు 20 మంది ప్రైమరీ కాంటాక్టులను గుర్తించి హోమ్ క్వరైంటైన్ లో ఉండాలని ఆదేశించారు అధికారులు. పేషెంట్ నివసించే ఏరియాలో సోడియం హైపో క్లోరైడ్ తో శానిటేషన్ చేశారు.