10 మంది ఇండోనేషియ‌న్ల‌పై కేసు న‌మోదు

10 మంది ఇండోనేషియ‌న్ల‌పై కేసు న‌మోదు

10 మంది ఇండోనేషియా దేశస్థులు, మరియు రామగుండం లోని ఒక మసీద్ ఇమామ్ పై రామగుండం పోలీసుస్టేషన్ లో కేసు నమోదు. మార్చి-14న ఉదయం వారు ఢిల్లీ నుండి సంపర్క్ క్రాంతి ట్రైన్ లో రామగుండం రైల్వే స్టేషన్ లో దిగి ముసలియా మజీద్ లో ప్రార్థనలు చేశారు. త‌ర్వాత‌ కరీంనగర్ కి వెళ్లారు. ఇటీవ‌ల‌ స‌మాచారం అందుకున్న పోలీసులు కరీంనగర్ లో వారికీ పరీక్షలు నిర్వహించగా.. కరోనా పాజిటివ్ వ‌చ్చిన విష‌యం తెలిసిందే. అయితే వారికీ కరోనా సోకింద‌ని ముందే తెలిసినా క‌రీంన‌గ‌ర్ లో తిరిగారని తెలిపారు పోలీసులు.

రామగుండం ప్రాంతం ప్రజలకి వ్యాపింప చేయాలనే చెడు ఉద్దేశ్యం, వారి నిర్లక్ష్యంగా కారణంగా ఇతరులకు కూడా కరోనా సోకిందని అన్నారు. వారు వచ్చినా పోలీసులకు సమాచారం ఇవ్వకపోవడం.. టూరిస్ట్ వీసా మీద వచ్చి పర్యాటక కేంద్రాలను సందర్శించకుండా మసీదును సందర్శించడాన్ని నేరంగా పరిగణిoచామ‌ని తెలిపారు పోలీసులు. ఈ క్ర‌మంలోనే వారిపై కేసు న‌మోదు చేశామ‌ని తెలిపారు. చ‌ట్ట‌ప‌ర‌మైన చ‌ర్య‌లు తీసుకుంటామ‌న్నారు రామగుండం సీఐ కరుణాకర్ రావు.