చిరుతపులి దాడిలో 10 గొర్రెలు మృతి

చిరుతపులి దాడిలో 10 గొర్రెలు మృతి

చిరుత దాడిలో 10 గొర్రెలు మృతి చెందాయి. ఈ సంఘటన చిత్తూరు జిల్లా, కుప్పం మండలంలో ఆదివారం జరిగింది. చిన్న గోపనపల్లి, గరిగచినపల్లి, అగ్రహారం, బైరప్పని గుట్ట గ్రామాల్లో రెండు రోజుల నుండి చిరుతపులి గ్రామస్థులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. ఆదివారం అర్ధరాత్రి 3 గంటల ప్రాంతంలో గ్రామంలోకి చొరబడ్డ చిరుత 10 గొర్రెల ప్రాణాలు తీసి మరిన్ని గొర్రెలను తీవ్ర గాయపరచిందని తెలిపారు.

గ్రామాల్లో నిద్రిస్తున్న సమయంలో చిరుత సంచరించడంతో ..గ్రామస్థులు బిక్కు బిక్కు మంటున్నారు. అటవీ సమీప గ్రామాలు కావడంతో తరచు వన్యప్రాణుల దాడిలో తీవ్రంగా నష్టపోతున్నామని గ్రామస్థులు  చెప్పారు. ఇంత జరిగినా అధికారులు స్పందించకపోవడం దారుణమని గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు.