భారత్ లో కరోనా కేసులు 1029..మరణాలు 24

భారత్ లో కరోనా కేసులు 1029..మరణాలు 24

దేశంలో కరోనా మహమ్మారి రోజురోజుకూ విజృంభిస్తోంది. రోజురోజుకు వందలాది కేసులు నమోదవుతున్నాయి.. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 1029 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.24 మంది చనిపోయారు. 85 మంది కోలుకున్నారు.

అత్యధికంగా మహారాష్ట్రలో 186, కేరళలో 182 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఆ తర్వాత కర్ణాటక 81, తెలంగాణ 67, ఉత్తరప్రదేశ్ 65,గుజరాత్ 55, రాజస్థాన్ 54, ఢిల్లీ 49 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇక అత్యధికంగా మహారాష్ట్రలో 6 మంది కరోనాతో చనిపోయారు.ఆ తర్వాత గుజరాత్ లో 4, కర్ణాటకలో 3, మధ్యప్రదేశ్ 2 మరణాలు నమోదయ్యాయి. ఇక తెలంగాణలో  కరోనాతో ఒకరు చనిపోయారు.

 ఒక్కడు వేలమందికి అంటించిపోయాడు