
దేశవ్యాప్తంగా 650 జవహర్ నవోదయ విద్యాలయా(జేఎన్వీ)ల్లో పదకొండో తరగతిలో ఖాళీల సీట్ల భర్తీ(లేటరల్ ఎంట్రీ)కి సంబంధించి కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వశాఖ జేఎన్వీ ఎంపిక పరీక్షకు దరఖాస్తులు కోరుతోంది.
అర్హత : ప్రవేశానికి అర్హత పొందాలంటే విద్యార్థి తప్పనిసరిగా జవహర్ నవోదయ విద్యాలయం ఉన్న సంబంధిత జిల్లాల్లో నివాసి అయి ఉండాలి. విద్యార్థులు 2023–-24 విద్యా సంవత్సరంలో ఆయా జిల్లాల్లోని ప్రభుత్వ, ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలల్లో పదో తరగతి చదువుతుండాలి.
ఎగ్జామ్ ప్యాటర్న్ : జవహర్ నవోదయ ప్రవేశానికి నిర్వహించే రాత పరీక్షలో వచ్చే మార్కులు ఆధారంగా విద్యార్థుల ఎంపిక ఉంటుంది. ప్రవేశ పరీక్ష ప్రశ్నపత్రంలో అయిదు విభాగాలు(మెంటల్ ఎబిలిటీ, ఇంగ్లీష్, సైన్స్, సోషల్ సైన్సెస్, మ్యాథమెటిక్స్) ఉంటాయి. మొత్తం 100 ప్రశ్నలు 100 మార్కులకు 2.30 గంటల సమయంలో ప్రవేశ పరీక్ష ఉంటుంది. పరీక్ష పేపర్ ఇంగ్లీష్, హిందీ భాషల్లో ఉంటుంది.
దరఖాస్తులు : అర్హులైన అభ్యర్థులు ఆన్లైన్లో అక్టోబర్ 31 వరకు దరఖాస్తు చేసుకోవాలి. ఎంట్రెన్స్ ఎగ్జామ్ 2024 ఫిబ్రవరి 10న నిర్వహిస్తారు. వివరాలకు www.navodaya.gov.in వెబ్సైట్లో సంప్రదించాలి.