- ఇంజినీరింగ్, ఫార్మసీ కాలేజీలకు ఏఐసీటీఈ ఆదేశాలు
హైదరాబాద్, వెలుగు: ఇంజినీరింగ్, ఫార్మసీ ప్రైవేటు కాలేజీల్లో పనిచేసే ప్రిన్సిపల్స్ క్వాలిఫికేషన్లను ఏఐసీటీఈ ఖరారు చేసింది. ఈ ఏడాది నుంచి ఇంజినీరింగ్ కాలేజీల ప్రిన్సిపల్స్కు 15 ఏండ్ల టీచింగ్ ఎక్స్పీరియెన్స్తో పాటు పీహెచ్డీ తప్పనిసరి చేసింది. ఇందులో ఐదేండ్లు తప్పకుండా ప్రొఫెసర్గా టీచింగ్ అనుభవముండాలని సూచించింది. ఫార్మసీ కాలేజీల్లోనూ ఇదే విధానాన్ని అమలు చేయాలని వర్సిటీలకు ఆదేశాలిచ్చింది. ప్రిన్సిపల్స్ రిక్రూట్మెంట్ విషయంలో ఇంజినీరింగ్ కాలేజీలు ఏఐసీటీఈ గెజిట్– 2019, ఫార్మసీ కాలేజీలు పీసీఐ గెజిట్ను అమలు చేయాలని కోరింది. దీన్ని అన్ని కాలేజీలు అమలు చేయాలని తాజాగా మేనేజ్మెంట్లకు జేఎన్టీయూ లెటర్ రాసింది. అయితే 2017 నుంచి అఫిలియేషన్ కాలేజీల్లోని ప్రొఫెసర్ పోస్టులను జేఎన్టీయూ రాటిఫికేషన్ చేయలేదు. దీంతో చాలామంది ప్రిన్సిపల్ పోస్టులను కోల్పోవాల్సి వస్తుందని లెక్చరర్లు చెబుతున్నారు.