రెండో రోజు బీజేపీకి 178 దరఖాస్తులు

రెండో రోజు బీజేపీకి 178 దరఖాస్తులు

హైదరాబాద్, వెలుగు: బీజేపీ తరఫున ఎమ్మెల్యేగా పోటీ చేసేందుకు మంగళవారం 178 దరఖాస్తులు వచ్చాయి. మొదటి రోజున182 దరఖాస్తులు రాగా..రెండో రోజున అదే స్థాయిలో దరఖాస్తులు అందాయి. ఈ నెల 10 వరకు దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ కొనసాగనుంది. 

మంగళవారం దరఖాస్తు చేసుకున్న వారిలో మాజీ ఎమ్మెల్యే కటకం మృత్యుంజయం సిరిసిల్ల నుంచి, బాలాపూర్ గణేశ్​ఉత్సవ కమిటీ అధ్యక్షుడు కొలన్ శంకర్ రెడ్డి మహేశ్వరం నుంచి,  
కార్వాన్ నుంచి బీజేపీ రాష్ట్ర కార్యదర్శి ఉమారాణి  తదితరులు దరఖాస్తు చేసుకున్న వారిలో ఉన్నారు. గత రెండు రోజులుగా దరఖాస్తు చేసుకునేందుకు వచ్చే పార్టీ లీడర్లతో  బీజేపీ స్టేట్ ఆఫీసు సందడిగా మారింది.