గ్రెనేడ్ పేలి ఇద్దరు ఆర్మీ జవాన్లు మృతి

గ్రెనేడ్ పేలి ఇద్దరు ఆర్మీ జవాన్లు మృతి

జమ్మూ కశ్మీర్‌లోని పూంచ్‌లో  నియంత్రణ రేఖ( ఎల్‌ఓసి) వద్ద గ్రెనేడ్ పేలడంతో ఇద్దరు ఆర్మీ జవాన్లు మరణించారు.  ఈ ఘటనలో ఆర్మీ కెప్టెన్, జూనియర్ కమిషన్డ్‌ ఆఫీసర్‌ మృతి చెందినట్లుగా ఆర్మీ అధికారులు వెల్లడించారు.  అదివారం(జులై 17) రాత్రి   పూంచ్ జిల్లా మెంధార్ సెక్టార్‌లో సైనికులు నియంత్రణ రేఖ వెంబడి తమ విధులు నిర్వహిస్తున్నప్పుడు ప్రమాదవశాత్తు గ్రెనేడ్ పేలుడు సంభవించింది.  ఈ ఘటనలో గాయపడిన సైనికులను వెంటనే హెలికాప్టర్‌లో ఉదంపూర్‌కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఇద్దరు ఆర్మీ జవాన్లు తుదిశ్వాస విడిచారు. మరణించిన జవాన్లను కెప్టెన్ ఆనంద్, నాయబ్ సుబేదార్ భగవాన్ సింగ్‌గా గుర్తించారు.