జమ్మూ కశ్మీర్లోని పూంచ్లో నియంత్రణ రేఖ( ఎల్ఓసి) వద్ద గ్రెనేడ్ పేలడంతో ఇద్దరు ఆర్మీ జవాన్లు మరణించారు. ఈ ఘటనలో ఆర్మీ కెప్టెన్, జూనియర్ కమిషన్డ్ ఆఫీసర్ మృతి చెందినట్లుగా ఆర్మీ అధికారులు వెల్లడించారు. అదివారం(జులై 17) రాత్రి పూంచ్ జిల్లా మెంధార్ సెక్టార్లో సైనికులు నియంత్రణ రేఖ వెంబడి తమ విధులు నిర్వహిస్తున్నప్పుడు ప్రమాదవశాత్తు గ్రెనేడ్ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో గాయపడిన సైనికులను వెంటనే హెలికాప్టర్లో ఉదంపూర్కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఇద్దరు ఆర్మీ జవాన్లు తుదిశ్వాస విడిచారు. మరణించిన జవాన్లను కెప్టెన్ ఆనంద్, నాయబ్ సుబేదార్ భగవాన్ సింగ్గా గుర్తించారు.
Captain Anand and Nb Sub Bhagwan Singh lost their lives in a grenade blast that occurred while they were performing their duties on the Line of Control (LoC) in Mendhar Sector (J&K): Indian Army officials pic.twitter.com/IhURxzSEnv
— ANI (@ANI) July 18, 2022