మంచు చరియలు పడి ఇద్దరు సైనికుల మృతి

మంచు చరియలు పడి ఇద్దరు సైనికుల మృతి

కేంద్రపాలిత ప్రాంతం లఢఖ్ లోని దక్షిణ సియాచిన్ గ్లేసియర్ సెక్టార్ లో మంచు చరియలు విరిగి పడి భారత ఆర్మీ గస్తీ టీంకు చెందిన ఇద్దరు చనిపోయారు. శనివారం సియాచిన్ గ్లేసియర్ ప్రాంతంలో 18,000 అడుగుల ఎత్తులో గస్తీ తిరుగుతున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది. సమాచారం తెలిసిన వెంటనే అవలాంచీ రెస్క్యూ టీమ్(ART) ఘటనా స్థలానికి చేరుకుంది. హెలికాప్టర్లను కూడా రంగంలోకి దింపారు. హిమపాతంలో గస్తీ బృందం చిక్కుకున్న ప్రాంతాన్ని మొదట గుర్తించిన సహాయక బృందం దట్టమైన మంచులో కూరుకుపోయిన సిబ్బందిని వెలికి తీశారు. అప్పటికే ఇద్దరు ఆర్మీ సిబ్బంది చనిపోయారని … సురక్షితంగా వెలికి తీసిన మిగిలినవారిని హెలికాప్టర్ల ద్వారా ఆర్మీ బేస్ క్యాంప్‌ కు ట్రీట్మెంట్ కోసం తరలించినట్లు తెలిపారు.