తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వేళ పోలీసుల తనిఖీల్లో భారీగా నగదు పట్టుబడుతోంది. బుధవారం (నవంబర్ 22న) నాచారం పోలీస్ స్టేషన్ పరిధిలో పోలీసులు నిర్వహించిన తనిఖీల్లో భారీగా నగదు స్వాధీనం చేసుకున్నారు. ఎన్నికల కోడ్ ప్రకియలో భాగంగా పోలీసులు నాచారంలో తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో కారులో తరలిస్తున్న కోటి 20 లక్షల రూపాయలను స్వాధీనం చేసుకున్నారు.
హబ్సిగూడ నుండి భువనగిరికి కారులో డబ్బులు తరలిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. డబ్బులను తరలిస్తున్న వారిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. తెలంగాణ ఎన్నికల వేళ ముమ్మర తనిఖీలు నిర్వహిస్తున్న పోలీసులు.. సరైన పత్రాలు లేకుండా నగదు తరలిస్తే సీజ్ చేస్తున్నారు.