హైదరాబాద్సిటీ, వెలుగు : జూ పార్కుకు జనం పోటెత్తారు. మరికొద్ది రోజుల్లో సెలవులు ముగియనున్న నేపథ్యంలో ఆదివారం 24,210 మంది సందర్శకులు విజిట్చేశారు. గత ఏడాది లెక్కనే ఈసారి కూడా పెద్ద సంఖ్యలో సందర్శకులు వచ్చారని జూ పార్కు అధికారులు తెలిపారు. రష్ ఎక్కువగా ఉండడంతో అదనంగా టికెట్ బుకింగ్ కౌంటర్ను ఏర్పాటు చేశారు.
జూపార్క్క్యూరేటర్ జె. వసంత మాట్లాడుతూ 380 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న జూపార్కులో 195కు పైగా జంతు జాతులున్నాయన్నారు. ప్రతి ఏడాది మేలో అత్యధిక రద్దీ నమోదవుతుందని, అందుకు తగ్గ ఏర్పాట్లు చేస్తున్నట్టు చెప్పారు. కాగా, ప్రజా పాలన – ప్రగతి ప్రణాళికలో భాగంగా ఆదివారం బర్డ్ వాక్ నిర్వహించగా, 70 మంది పక్షి ప్రేమికులు పాల్గొన్నారు.
