మహారాష్ట్ర గడ్చిరౌలి జిల్లాలో భారీ ఎన్ కౌంటర్ జరిగింది. ఈ ఎన్ కౌంటర్ లో 26 మంది మావోయిస్టులు చనిపోయినట్టు ఎస్పీ అంకిత్ గోయల్ ప్రకటించారు. గ్యారపట్టి అటవీ ప్రాంతంలో మావోయిస్టులు-భద్రతాదళాలకు మధ్య నిన్నటి నుంచి భారీ ఎన్ కౌంటర్ జరిగింది. సంఘటనా స్థలాన్ని తమ అదుపులోకి తీసుకున్న బలగాలు.. కూంబింగ్ కొనసాగిస్తున్నాయి. ఈ కాల్పుల్లో ముగ్గురు జవాన్లకు గాయాలయ్యాయి. వారిని హాస్పిటల్ కు తరలించారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశముందని పోలీసులు భావిస్తున్నారు.
26 Naxals have been eliminated in an encounter with the C-60 unit of Maharashtra Police in the jungles of Gyarapatti in Gadchiroli district today. Three jawans have suffered injuries in the encounter: Gadchiroli SP Ankit Goel
— ANI (@ANI) November 13, 2021