సౌత్ బ్యూటీ అంజలి(Anjali) ప్రధాన పాత్రలో వచ్చిన సూపర్ హిట్ మూవీ గీతాంజలి. 2014లో వచ్చిన ఈ సినిమా దర్శకుడు రాజ్ కిరణ్ తెరకెక్కించగా..శ్రీనివాస్ రెడ్డి, సత్యం రాజేష్, రావ్ రమేష్, బ్రహ్మానందం కీ రోల్స్ లో కనిపించారు.అయితే దాదాపు 10 సంవత్సరాల తరువాత గీతాంజలి సినిమాకు సీక్వెల్గా గీతాంజలి మళ్ళీ వచ్చింది(Geethanjali Malli Vachindi) అనే సినిమా ఏప్రిల్ 11న థియేటర్లలోప్రేక్షకుల ముందుకు వచ్చింది.
ప్రముఖ రచయిత కోన వెంకట్ కథ అందించిన ఈ సినిమాకు ఆడియన్స్ నుంచి మిక్స్ డ్ టాక్ వచ్చింది. దీంతో బాక్సాఫీస్ వద్ద అనుకున్న రేంజ్లో ఈ మూవీ కలెక్షన్లను రాబట్టలేకపోయింది. ఇక ఈ హర్రర్ ఫిల్మ్ ఓటీటీలో స్ట్రీమింగ్ కావడానికి రెడీగా ఉంది.
ఈ మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియో దక్కించుకున్నట్లు సమాచారం. కాగా మే 10వ తేదీన ఈ సినిమా ఓటీటీలో స్ట్రీమింగ్కు సిద్ధమయినట్లు టాక్ బయటికి వచ్చింది.అంటే,ఈ సినిమా థియేటర్స్ కి వచ్చిన నెల రోజుల్లోనే ఓటీటీకి వస్తుండటం విశేషం. మరి థియేటర్లో యావరేజ్ టాక్ తెచ్చుకున్న హార్రర్ ఫిల్మ్ ఓటీటీ ఆడియన్స్ ని ఎలా భయపెట్టనుందో చూడాలి.త్వరలో ఈ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ వివరాలను మేకర్స్ అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది.
కథేంటంటే:
‘గీతాంజలి’ సినిమా తీసి తొలి ప్రయత్నంలోనే దర్శకుడిగా సత్తా చాటిన శ్రీను అలియాస్ శ్రీనివాస్ (శ్రీనివాస్ రెడ్డి) ఆ తర్వాత హ్యాట్రిక్ ఫ్లాప్లు ఇస్తాడు. ఫలితంగా చేతిలో అవకాశాలు లేక ఆర్థిక సమస్యల్లో చిక్కుకుంటాడు.ఈ క్రమంలోనే పొట్టకూటి కోసం వైజాగ్లో ఉంటున్న తన మిత్రుడు అయాన్ (సత్య)ను హీరో చేస్తానని చెప్పి మోసం చేస్తూ ఉంటాడు. ఒకరోజు హైదరాబాద్ వచ్చిన అయాన్.. తాను మోసపోయానని అర్థమై శ్రీను పరిస్థితి చూసి ఏమీ చేయలేకపోతాడు. అప్పుడే అయాన్, శ్రీనులతో పాటు తన సహ రచయితలు ఆరుద్ర (షకలక శంకర్), ఆత్రేయ (సత్యం రాజేష్) గ్యాంగ్ ఓ ఆలోచన చేస్తారు.
ఇండస్ట్రీకి దూరంగా వెళ్లిపోవాలని నిర్ణయం తీసుకుంటారు. సరిగ్గా అప్పుడే ఊటీలో ఉండే విష్ణు రిసార్ట్స్ యజమాని విష్ణు (రాహుల్ మాధవ్) మేనేజర్ నుంచి శ్రీనుకు ఓ ఫోన్ వస్తుంది. తనతో ఓ హారర్ థ్రిల్లర్ సినిమా నిర్మిస్తానని చెప్పి.. ఓ కథను శ్రీను గ్యాంగ్ చేతిలో పెడతాడు. కాకపోతే ఆ కథను తాను కొన్న సంగీత్ మహల్లోనే చిత్రీకరించాలని షరతు పెడతాడు.
ఆ కథ కోసం హీరోయిన్ గా అంజలి (అంజలి)ని తీసుకోమని సూచిస్తాడు. వాళ్లంతా విష్ణు మాట ప్రకారమే సినిమాని ఆ మహల్లోనే తీసేందుకు సిద్ధమై అక్కడ అడుగు పెడతారు. మరి ఆ మహల్లోకి అడుగు పెట్టిన హీరోయిన్ అంజలి, శ్రీను గ్యాంగ్కు ఎలాంటి అనుభవాలు ఎదురయ్యాయి? విష్ణు తన సినిమాని ఆ మహల్లోనే చిత్రీకరించాలని ఎందుకు అంతలా పట్టుబట్టాడు? తన చిత్రాన్ని అంజలి, శ్రీనుల చేతుల్లోనే ఎందుకు పెట్టాలనుకున్నాడు ? వీళ్ల కోసం గీతాంజలి ఆత్మ మళ్లీ ఎందుకు తిరిగొచ్చింది? అనేది చూసి తెలుసుకోవాల్సిందే.