
రాష్ట్రంలో 272కుచేరిన బాధితుల సంఖ్య
హైదరాబాద్లో వందదాటిన కేసులు
మొత్తం కేసుల్లో హైదరాబాద్ జిల్లాలో నే 110 కేసులు ఉండగా.. ఆ తర్వాత వరంగల్ అర్బన్, నిజా మాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, కామారెడ్డి, నల్గొం డ, కరీంనగర్ జిల్లాల్లో కేసులు అధికంగా ఉన్నాయి. శనివారం వైరస్ పాజిటివ్గా తేలిన 43 మందికి ఢిల్లీ మర్కజ్ లింక్ ఉన్నట్టు అధికారులు తెలిపారు. ఇందులో ఢిల్లీ వెళ్లొచ్చి నవారితో పాటు వారి వ్యక్తుల కుటుంబ సభ్యు లు ఉన్నారని వివరించారు.
ఆదివారం ఐదొందల మందికి టెస్టులు
రాష్ట్రం నుంచి 1,090 మంది మర్కజ్ కు వెళ్లారని మంత్రి ఈటల రాజేందర్ వెల్ల డించారు. ప్రస్తుతం నమోదవుతున్న కేసులన్నీ మర్కజ్ లింక్ ఉన్నవేనని తెలిపారు. వారందరినీ గుర్తించి క్వారంటైన్ సెంట రకు తర ్ల లించామని, సెంటరలో్ల డాకర్టను కూడా ్ల నియమించామని చెప్పారు. అయితే శనివారం రాత్రి నాటికి మర్కజ్ వెళ్లొచ్చి నవారిలో సుమారు 600 మందికి టెస్టులు పూర్తయ్యాయని హెల్త్డిపార్ట్ మెంట్ అధికారులు తెలిపారు. మరో 480 మందికి ఆదివారం టెస్టులు చేయిస్తామని వెల్ల డించారు. శనివారం పాజిటివ్గా తేలిన 43 మంది కుటుంబ సభ్యులకు కూడా ఆదివారం టెస్టులు చేయించను న్నారు. ఈ నేపథ్యంలో ఆదివారం కూడా భారీగానే కేసులు బయటపడే అవకాశం ఉందని హెల్త్డిపార్ట్ మెంట్ వర్గాలు చెప్పాయి.
నాలుగు లక్షల టెస్టింగ్ కిట్లు
కరోనా పేషెంట్లకు ట్రీట్మెంట్ అందించేందుకు గచ్చిబౌలి స్పోర్స్ ట్ కాంప్లె క్స్ను పూర్తిస్థాయి దవాఖానా గా తీర్చుదిద్దుతు న్నామని మంత్రి ఈటల వెల్ల డించా రు. రెండ్రోజుల్లో 1,500 బెడ్లతో ఆ దవాఖానాఅందు బాటులోకి వస్తుందని ప్రకటించారు. కరోనాటెస్టుల కోసం నాలుగు లక్షల కిట్లకోసం ఆరర్్డ చేశామని పేర్కొన్నారు. రాష్ట్రంలో ఎన్95 మాస్కులు, పీపీఈ కిట్లకు కొరత లేదన్నారు. ఐదు లక్షల పీపీఈ కిట్లు, ఐదు లక్షల ఎన్95 మాస్కులు, 20 లక్షల సర్జికర్జిల్ మాస్కులు, 25 లక్షల హ్యాండ్ గ్లవ్స్, ఐదొందల వెంటిలేటర్లకొనుగోలుకు ఆర్డర్ చేశామని పేర్కొన్నారు.
ఇంటింటి సర్వేలో 147 మంది గుర్తింపు
కరోనా కేసులు అధికంగా నమోదవుతున్న ప్రాంతాల్లో హెల్త్ డిపార్ట్మెంట్ టీమ్లు ఇంటింటి సర్వే చేస్తున్నాయి. ఇప్పటివరకు 1,376 బృందాల ద్వారా 1,07,658 ఇండ్లకు వెళ్లి పరిశీలించామని పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు తెలిపారు. మొత్తంగా 4,45,938 మందిని పరీక్షించి, వైరస్ లక్షణాలు ఉన్న 147 మందిని గుర్తించామని.. వారిని దవా ఖానాలకు తరలించామని వెల్లడించారు. రాష్ట్రంలో ఇప్పటివరకూ వైరస్ కమ్యునిటీ స్ప్రెడ్ అయినట్టుగా ఆధారాలు లేవని పేర్కొన్నారు.