ఖమ్మం: ఖమ్మం జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. ఆదివారం కావడంతో సరదాగా ఈతకు వెళ్లిన ముగ్గురు యువకులు గల్లంతయ్యారు. జిల్లాలోని పెనుబల్లి మండలం పులిగుండాల ప్రాజెక్ట్లో ఈతకు వెళ్లిన ముగ్గురు యువకులు నీటిలో మునిగిపోయారు. గల్లంతైన వారు కల్లూరు మండలం బత్తులపల్లికి చెందిన జంగ గుణ (24), శీలం చలపతి(25), వేమి రెడ్డి సాయి(18)గా గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు యువకుల ఆచూకీ కోసం గజఈతగాళ్లను రంగంలోకి దింపారు. ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఆదివారం పూట సరదాగా ఈత కోసం వెళ్లి యువకులు గల్లంతుకావడంతో స్వగ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. యువకుల ఆచూకి కోసం గజఈతగాళ్లను రంగంలోకి దింపారు.
