నదిలో పడ్డ బస్సు.. 32 మంది మృతి

నదిలో పడ్డ బస్సు.. 32 మంది మృతి

ఖట్మాండు: నేపాలో ఘోర ప్రమాదం జరిగింది. బస్సు నదిలో పడిపోవడంతో 32 మంది ప్రయాణికులు మరణించారు. చాలామంది గాయపడ్డారని అధికారులు తెలిపారు. మంగళవారం నేపాల్‌‌‌‌ గంజ్‌‌‌‌నుంచి ముగు జిల్లా కేంద్రమైన గమ్‌‌‌‌గాధి వైపు వెళ్తున్న ఓ బస్సు ఛాయనాథ్‌‌‌‌ రారా మున్సిపాలిటిలో ఉన్న పినా జ్యారీ నదిలో 300 అడుగుల లోతులో ప్రమాదవశాత్తు పడిపోయింది. దసరా పండుగ సందర్భంగా వివిధ ప్రాంతాల్లో ఉన్న ప్రజలు తమ సొంత ఊళ్లకు బస్సులో వెళ్తుండగా ప్రమాదం జరిగింది. విషయం తెలుసుకున్న అధికారులు సహాయక చర్యల కోసం ఆర్మీని రంగంలోకి దింపారు.