24 గంటల్లో 3.26 లక్షల కేసులు..3890 మరణాలు

24 గంటల్లో 3.26 లక్షల కేసులు..3890 మరణాలు

దేశంలో కరోనా కేసులు కాస్త తగ్గుముఖం పడుతున్నాయి. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 3 లక్షల  26 వేల 98 మంది కరోనా బారిన పడ్డారు. దీంతో మొత్తం బాధితుల సంఖ్య 2 కోట్ల 43 లక్షల 72 వేల 907కు పెరిగింది. ఇక నిన్న దేశవ్యాప్తంగా కరోనా కారణంగా 3 వేల 890 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 2 లక్షల 66 వేల 207 కు పెరిగింది. ఇక నిన్న 3 లక్షల 53 వేల మంది హాస్పిటల్స్ నుంచి డిశ్చార్జ్ కాగా...మొత్తం కోలుకున్న వారి సంఖ్య 2 కోట్ల 4 లక్షలు దాటింది. ప్రస్తుతం దేశంలో 36 లక్షల 73 వేల 802 యాక్టివ్ కేసులున్నాయి. శుక్రవారం ఒక్క రోజు దేశవ్యాప్తంగా 16 లక్షల 93 వేల శాంపిల్స్ పరీక్షించామని తెలిపింది ICMR. ఇక ఇప్పటివరకూ 18 కోట్ల 4 లక్షల వ్యాక్సిన్ డోసులు పంపిణీ చేసినట్లు స్పష్టం చేసింది. శుక్రవారం ఒక్కరోజే 11 లక్షల మందికి వ్యాక్సిన్ ఇచ్చినట్లు తెలిపింది.