గ్రీన్ జోన్ గా ఉన్న యాదాద్రిలో న‌లుగురికి పాజిటివ్‌

గ్రీన్ జోన్ గా ఉన్న యాదాద్రిలో న‌లుగురికి పాజిటివ్‌

యాదాద్రి భువ‌న‌గిరి: నిన్న‌టి వ‌ర‌కు గ్రీన్ జోన్ లిస్టులో ఉన్న యాదాద్రి భువ‌న‌గిరిలో క‌ర‌నా క‌ల‌క‌లం రేపింది. ఆదివారం జిల్లాలో నలుగురికి కరోనా పాజిటివ్ ‌గా నిర్ధారణ అయింద‌ని జిల్లా కలెక్టర్ అనితా రామచంద్రన్‌ తెలిపారు. ఆత్మకూరు (ఎం) మండలంలో మూడు పాజిటివ్‌ కేసులు, సంస్థాన్‌ నారాయణపురంలో ఒక కేసు నమోదైనట్టు తెలిపారు క‌లెక్ట‌ర్‌.

అయితే, వారంతా ముంబై నుంచి స్వగ్రామాలకు వచ్చిన వార‌ని తెలిపారు. జిల్లాల్లో న‌లుగురికి కరోనా పాజిటివ్ ‌గా తేల‌డంతో వారి ప్రైమరీ కాంటాక్ట్ ‌లను గుర్తించి క్వారెంటైన్ ‌కు త‌ర‌లిస్తున్న‌ట్టు ‌ చెప్పిన క‌లెక్ట‌ర్.. జిల్లా వ్యాప్తంగా ఏడు చెక్ ‌పోస్టులు ఏర్పాటు చేసి జాగ్రత్తలు తీసుకుంటున్న‌ట్టు తెలిపారు.