ఎన్‌‌కౌంటర్‌‌‌‌లో నలుగురు మావోయిస్టులు మృతి... మృతుల్లో ముగ్గురు మహిళలు

ఎన్‌‌కౌంటర్‌‌‌‌లో నలుగురు మావోయిస్టులు మృతి... మృతుల్లో ముగ్గురు మహిళలు
  • మధ్యప్రదేశ్‌‌‌‌లోని బాలాఘాట్‌‌‌‌లో ఘటన 

భద్రాచలం, వెలుగు: మధ్యప్రదేశ్‌‌‌‌లోని బాలాఘాట్​జిల్లాలో శనివారం జరిగిన ఎన్‌‌‌‌కౌంటర్‌‌‌‌‌‌‌‌లో నలుగురు మావోయిస్టులు మృతి చెందారు. వీరిలో ముగ్గురు మహిళలు ఉన్నారు. గోండియా, రాజ్‌‌‌‌నందగావ్, బాలాఘాట్​డివిజన్లకు చెందిన మావోయిస్టులు దాదర్​అడవుల్లో సమావేశమయ్యారన్న సమాచారంతో హాక్​ఫోర్స్, పోలీసులతో 25 టీమ్‌‌‌‌లు ఏర్పాటు చేసి కూంబింగ్ నిర్వహించామని బాలాఘాట్ ఎస్పీ ఆదిత్య మిశ్రా తెలిపారు. 

‘‘భద్రతా బలగాలు కూంబింగ్ నిర్వహిస్తున్న క్రమంలో పచామా ప్రాంతంలో మావోయిస్టులు కాల్పులకు దిగారు. దీంతో భద్రతా బలగాలు ఎదురుకాల్పులు జరిపాయి. కాల్పులు జరుపుకుంటూ మావోయిస్టులు పారిపోయారు. ఘటనా స్థలంలో నలుగురు మావోయిస్టుల మృతదేహాలతో పాటు గ్రనెడ్ లాంచర్, ఎస్ఎల్ఆర్ ఆయుధాలు దొరికాయి. 

మృతి చెందిన మావోయిస్టులను గుర్తించే ప్రక్రియ జరుగుతున్నది. పారిపోయిన మావోయిస్టుల కోసం కూంబింగ్ కొనసాగుతుంది. మావోయిస్టుల ఏరివేతలో భాగంగా ప్రత్యేక బలగాలతో ఆపరేషన్స్ నిరంతరం కొనసాగిస్తున్నాం” అని వెల్లడించారు.