ఐపీఎల్‌ వేలానికి 405 మంది

ఐపీఎల్‌ వేలానికి 405 మంది

న్యూఢిల్లీ: ఐపీఎల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మినీ వేలానికి రంగం సిద్ధమైంది. 991 మంది ప్లేయర్ల నుంచి 87 స్లాట్స్‌‌‌‌‌‌‌‌ కోసం 405 మందిని షార్ట్‌‌‌‌‌‌‌‌ లిస్ట్‌‌‌‌‌‌‌‌ చేశారు. ఇందులో 273 మంది ఇండియన్‌‌‌‌‌‌‌‌, 132 మంది ఫారిన్‌‌‌‌‌‌‌‌ ప్లేయర్లు ఉన్నారు. మరో నలుగురు అసోసియేట్‌‌‌‌‌‌‌‌ దేశాలకు చెందిన వారు ఉన్నారు. వరల్డ్‌‌‌‌‌‌‌‌ ప్రీమియర్‌‌‌‌‌‌‌‌ ఆల్‌‌‌‌‌‌‌‌రౌండర్‌‌‌‌‌‌‌‌ బెన్‌‌‌‌‌‌‌‌ స్టోక్స్‌‌‌‌‌‌‌‌తో పాటు ఆసీస్‌‌‌‌‌‌‌‌ టాప్‌‌‌‌‌‌‌‌ ప్లేయర్‌‌‌‌‌‌‌‌ కామోరున్‌‌‌‌‌‌‌‌ గ్రీన్‌‌‌‌‌‌‌‌కు ఈసారి ఎక్కువ ధర పలికే చాన్స్‌‌‌‌‌‌‌‌ కనిపిస్తున్నది. ఈ ఇద్దరు రూ. 2 కోట్ల బిడ్డింగ్‌‌‌‌‌‌‌‌తో బరిలోకి దిగుతున్నా.. రూ. 15 నుంచి 17 కోట్ల వరకు వెచ్చించేందుకు ఫ్రాంచైజీలు ఆసక్తి చూపుతున్నాయి.

ఈ నెల 23న కొచ్చిలో ఈ వేలం జరగనుంది. కోల్‌‌‌‌‌‌‌‌కతా నైట్‌‌‌‌‌‌‌‌రైడర్స్‌‌‌‌‌‌‌‌ వద్ద అతి తక్కువగా రూ. 7.2 కోట్లు ఉండగా, సన్‌‌‌‌‌‌‌‌రైజర్స్‌‌‌‌‌‌‌‌ హైదరాబాద్‌‌‌‌‌‌‌‌ పర్స్‌‌‌‌‌‌‌‌లో రూ. 42.25 కోట్లు ఉన్నాయి. అలాగే ఎస్‌‌‌‌‌‌‌‌ఆర్‌‌‌‌‌‌‌‌హెచ్‌‌‌‌‌‌‌‌ 13 మందిని తీసుకునే చాన్స్‌‌‌‌‌‌‌‌ ఉంది. పంజాబ్‌‌‌‌‌‌‌‌ (రూ. 32.20 కోట్లు), సీఎస్‌‌‌‌‌‌‌‌కే (రూ. 20.45 కోట్లు), లక్నో (రూ. 23.35 కోట్లు), ముంబై ఇండియన్స్‌‌‌‌‌‌‌‌ (రూ. 20.55 కోట్లు), ఢిల్లీ క్యాపిటల్స్‌‌‌‌‌‌‌‌ (రూ. 19.45 కోట్లు), గుజరాత్‌‌‌‌‌‌‌‌ టైటాన్స్‌‌‌‌‌‌‌‌ (రూ. 19.25 కోట్లు) కూడా స్టార్ల కోసం పోటీ పడే చాన్స్‌‌‌‌‌‌‌‌ ఉంది. మనీష్‌‌‌‌‌‌‌‌ పాండే, మయాంక్‌‌‌‌‌‌‌‌ అగర్వాల్‌‌‌‌‌‌‌‌పై కూడా కొన్ని ఫ్రాంచైజీలు దృష్టి సారించాయి. కానీ ఇషాంత్‌‌‌‌‌‌‌‌, అజింక్యా రహానెపై మాత్రం ఎవరూ పెద్దగా ఆసక్తి చూపడం లేదు.